Delhi Car Blast: పేలుడులో డెలవరీ బాయ్ సజీవదహనం.. అనుమానితుడు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Car Blast: దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సోమవారం సాయంత్రం పేలుడు దద్దరిల్లింది. ఈ బాంబు పేలుడులో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా, 24 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారందరిని ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి NIA, NSG బృందాలు చేరుకున్నాయి. ఢిల్లీలో కారు పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ముంబై, హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో ఈ హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఘటనాస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
READ ALSO: Vijay Sethupati : హీరోయిన్ పై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్
Also Read
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
డెలివరి బాయ్ సజీవదహనం
ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలం దగ్గర భారీ పేలుడు కారణంగా మంటలు అంటుకొని ఒక డెలివరి బాయ్ సజీవదహనం అయ్యారు. పేలిన కారులో హైగ్రేడ్ ఎక్స్ప్లోజివ్ ఉపయోగించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్రహోంమంత్రి అమిత్షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేలుడుపై దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే ఆయన ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు, ఐబీ చీఫ్తో మాట్లాడినట్లు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడి తనతో మాట్లాడినట్లు అమిత్షా వెల్లడించారు. పేలుడుపై NIA, NSG దర్యాప్తు జరుగుతోందని, అన్ని కోణాల్లో దర్యాప్తు ముందుకుసాగుతుందని పేర్కొన్నారు. పేలుడు జరగగానే 10 నిమిషాల్లో అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించినట్లు చెప్పారు.
ఆస్పత్రికి అమిత్షా..
అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్షా LNJP ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. బాధితుల పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. పేలుడుపై NIA, NSG దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అనంతరం అమిత్షా పేలుడు జరిగిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇప్పటికే పేలుడు ఘటనలో ఒక అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేలుడు జరిగిన కారు హర్యానాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. పేలుడు సమయంలో కారులో ముగ్గురు ఉన్నారని తెలిపారు. సాయంత్రం 6:52 గంటలకు ఈ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నదీమ్ఖాన్ అనే వ్యక్తి పేరుపై కారు రిజిస్ట్రేషన్ అయ్యిందని, దాని రిజిస్ట్రేషన్ నంబర్ HR267674 అని పేర్కొన్నారు.
READ ALSO: Delhi Car Blast Live Updates : పేలుడులో 13 మంది మృతి.. ఉగ్రకోణంలో పలు అనుమానాలు..!
తాజావార్తలు
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..