Air Pollution : దీపావళి తర్వాత ఢిల్లీలో దారుణంగా మారిన గాలి.. 700దాటిన ఏక్యూఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Pollution : దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా పొగ మేఘాలు కమ్ముకోవడంతో ప్రజలు విషపూరితమైన గాలి పీల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఇప్పుడు దీపావళి తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం వల్ల నగరంలో ఎక్కడ చూసినా పొగలు కమ్ముకుంటున్నాయని, ఢిల్లీ గ్యాస్ ఛాంబర్గా మారిందని చెప్పక తప్పదు. బాణసంచా కారణంగా ఢిల్లీ గాలి నాణ్యత చాలా పేలవమైన స్థితికి చేరుకుంది. ఉదయం 5:30 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 700 కంటే ఎక్కువ నమోదైంది. దీపావళి తర్వాత ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. అంతేకాకుండా రోడ్లపై పలు చోట్ల పటాకుల అవశేషాలు కూడా దర్శనమిస్తున్నాయి.
ఎక్కడ ఏక్యూఐ ఎంత ఉంది?
ఆనంద్ విహార్ – 714
సిరిఫోర్ట్ – 480
గురుగ్రామ్ – 185
డిఫెన్స్ కాలనీ – 631
నోయిడా – 332
షహదర – 183
నజాఫ్ఘర్ – 282
పట్పర్గంజ్ – 513
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
Read Also:CM Chandrababu: నంబియార్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం!
ఆనంద్ విహార్తో సహా ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలలో ఏక్యూఐ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఢిల్లీ ప్రజలకు విషపూరితమైన గాలిని పీల్చుకోవడం తప్ప మరో మార్గం లేదు. గతేడాది దీపావళి రోజున ఆకాశం నిర్మలంగా ఉంది. ఏక్యూఐ 218గా నమోదైంది. అందుకు భిన్నంగా ఈ ఏడాది దీపావళి రోజున నగరంలో కాలుష్యం మళ్లీ తారాస్థాయికి చేరుకుంది. దీపావళికి ముందు కూడా ఢిల్లీలో ఏక్యూఐ 400 కంటే ఎక్కువగా ఉంది, కానీ దీపావళి తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
అంతేకాకుండా రాజధానిలో మెట్టలు దగ్ధం కావడం, వాహనాల నుంచి పొగలు రావడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఈ పరిస్థితులను నివారించడానికి, ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పటాకులను నిషేధించింది. దానిని అమలు చేయడానికి 377 ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేసింది. అవగాహన కల్పించే పని కూడా చేసింది. ఆ తర్వాత కూడా ఢిల్లీ గాలిలో ఎలాంటి ప్రభావం కనిపించలేదు. తూర్పు, పశ్చిమ ఢిల్లీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆంక్షలు ఉల్లంఘించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషపూరితమైన గాలిని పీల్చడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరియు ఇప్పటికే శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో దీపావళి సందర్భంగా 2022లో 312, 2021లో 382, 2020లో 414, 2019లో 337, 2018లో 281, 2017లో 319, 2016లో 431 ఏక్యూఐలు నమోదయ్యాయి.
Read Also:JK: జమ్మూకాశ్మీర్లో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం
#WATCH दिल्ली: राष्ट्रीय राजधानी के कई हिस्सों में दीपावली के बाद स्मॉग की परत देखने को मिल रही है। वीडियो साउथ एवेन्यू इलाके से है। pic.twitter.com/lGg4hiS68r
— ANI_HindiNews (@AHindinews) October 31, 2024
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!