Delhi : హోలీ పండుగ, రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి కూడలిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈరోజు ఢిల్లీలోని పీపీ సుబ్రొతో పార్క్లోని ఝరేరా ఫ్లైఓవర్ సమీపంలో నలుగురి నుంచి రూ.3 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురు యువకులు తమ స్కూటర్పై వెళుతుండగా, నల్లరంగు బ్యాగులు కలిగి ఉన్నారని, పోలీసులకు మొదట అనుమానం వచ్చి విచారించగా వారి బ్యాగుల్లోని రూ.3 కోట్ల నగదు బయటపడినట్లు సమాచారం. వారి నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాగ్ పూర్తిగా ప్లాస్టిక్తో సీల్ చేయబడింది. ఈ డబ్బు హవాలా నుంచి వచ్చినదని విచారణలో తేలింది.
Read Also:AP Crime: కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్..! అవి హత్యలు..
ఢిల్లీ కాంట్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ విపిన్ కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇటీవలి మార్గదర్శకాలను అనుసరించి, నలుగురు యువకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో మహ్మద్ షోమిన్, జిషాన్, డానిష్, సంతోష్ ఉన్నారు. విచారణలో రికవరీ చేసిన మొత్తం హవాలా డబ్బు అని, ఇది షహదారాలో స్క్రాప్ డీలర్గా పనిచేసిన మహ్మద్ వకీల్ మాలిక్కు చెందినదని నిందితులు చెప్పారు.
Read Also:Holi Special Songs : హోలీ స్పెషల్ తెలుగు సాంగ్స్ విన్నారా?
ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత రాజధానితోపాటు దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఎన్నికలు సక్రమంగా ముగిసే వరకు దేశవ్యాప్తంగా ప్రవర్తనా నియమావళి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వేలాది మంది భద్రతా బలగాలను మోహరించారు. సమాచారం మేరకు స్కూటర్పై వెళ్తున్న నలుగురు యువకులను పోలీసులు కొంత సమాచారం అడిగి పత్రాలు చూపించాలని కోరగా సరైన పత్రాలు కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.