Demanding Bribe : అచ్చం సినిమా మాదిరి.. ఫౌడర్ చల్లారు పట్టుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Demanding Bribe : లంచం డిమాండ్ చేసిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఈస్ట్ షాలిమార్ బాగ్లో ఓ ఇంటి నిర్మాణానికి బదులుగా లంచం డిమాండ్ చేసినందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) అధికారిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) హెడ్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (జేసీపీ) మధుర్ వర్మ తెలిపిన వివరాలు, తూర్పు షాలిమార్ బాగ్లో నివాసం ఉంటున్న సౌరభ్ జైన్ అనే వ్యక్తి ఇంటిని నిర్మించాలనుకున్నాడు. ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్మాణానికి అనుమతి కోసం మున్సిపల్ అధికారి నారాయణ్ ను ఆశ్రయించాడు. దీంతో అతడు రూ. లక్ష డిమాండ్ చేశాడు. లంచం ఇచ్చేందుకు ఇష్ట పడని సౌరభ్ అన్నయ్య రాజీవ్ మంగళవారం అవినీతి నిరోధక శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. తగిన బేరసారాల తర్వాత రూ.10వేలకు నారాయణ ఒప్పుకున్నట్లు రాజీవ్ చెప్పినట్లు జేసీపీ తెలిపారు.
Read Also: Election Results: నేడు 3రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీ జెండా ఎగిరేనో..?
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
- EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
ఎలాగైన అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని పోలీసులు రైడింగ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారుడికి ఫినాఫ్తలీన్ ఫౌడర్ చల్లిన రూ.పదివేల నోట్లను ఇచ్చారు. ఆ తర్వాత ఫిర్యాదుదారు నారాయణ్ను సంప్రదించి మీటింగ్ పాయింట్ను ఫిక్స్ చేశారు. ఫిర్యాదుదారుడితో పాటు రైడింగ్ బృందం మీటింగ్ పాయింట్కు వెళ్లింది. సాయంత్రం 4:30 గంటలకు, రైడింగ్ బృందం ఫిర్యాదుదారుతో కలిసి ఢిల్లీలోని షాలిమార్ బాగ్లోని మీటింగ్ పాయింట్కి చేరుకున్నారు. నారాయణ్ అప్పటికే అక్కడ ఉన్నాడు.. ఫిర్యాదుదారుడి కోసం కారులో వేసినట్లు పోలీసులు తెలిపారు. కొంత చిట్-చాట్ తర్వాత, నారాయణ్ ఫిర్యాదుదారు నుండి లంచం డబ్బు డిమాండ్ చేశాడు. దీనిపై ఫినాల్ఫ్తాలిన్ పౌడర్ కలిపిన రూ.10,000ను ఫిర్యాదుదారు అందజేశారు. ఆ తర్వాత రైడింగ్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసుల పార్టీని చూసి నారాయణ్ పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని రైడింగ్ టీం అతడిని ముట్టడించింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి రూ.10వేలు లంచం స్వాధీనం చేసుకున్నారు. అతనిపై సెక్షన్ 7 పీఓసీ యాక్ట్, పీఎస్ ఏసీబీ కింద కేసు నమోదు చేశారు. అనే కోణంలో తదుపరి విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
-
RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
-
Kitchen Hygiene: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు!
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!