Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Delhi Municipal Corporation Elections 2022

Delhi Municipal Elections: ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 13,638 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

Published Date :December 3, 2022 , 10:26 pm
By Mahesh Jakki
Delhi Municipal Elections: ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 13,638 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Delhi Municipal Elections: ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 250 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనుండగా.. 13,638 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 68 మోడ‌ల్ పోలింగ్ స్టేష‌న్లు, 68 పింక్ స్టేష‌న్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. 1349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సహా మిగతా పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికలను బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఉత్కంఠ పోటీ నెలకొననున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో 1.45 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓట‌ర్లు 78,93,418, మ‌హిళా ఓట‌ర్లు 66,10,879, ట్రాన్స్‌జెండ‌ర్ ఓట‌ర్లు 1,061 మంది ఉన్నారు. డిసెంబ‌ర్ 7వ తేదీని ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది.

వార్డుల పునర్విభజన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కానున్నాయి. భద్రత పరంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల భద్రతా విధుల్లో 30 వేల భద్రతా సిబ్బంది పాల్గొననున్నారు. వీరిలో సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీస్, హోంగార్డులున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువమంది సాయుధ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగే ఆదివారం రోజు ఉదయం నాలుగున్నర నుంచే మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. అలాగే, ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా మద్యం విక్రయాలపై ఢిల్లీలో నిషేధం విధించారు. శుక్రవారం సాయంత్రం 5గంటల 30 నిమిషాల నుంచి ఆదివారం ఎన్నికలు ముగిసే వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. ఓట్ల లెక్కింపు జరిగే డిసెంబర్ 7వ తేదీన కూడా ఆల్కహాల్ అమ్మకాలపై నిషేధం ఉండనుంది.

Global Aviation Safety Ranking: గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్‌లో 48వ ర్యాంక్‌కు ఎగబాకిన భారత్

ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఒపీనియ‌న్ పోల్స్ నిర్వహించ‌కూడ‌ద‌ని ఎన్నిక‌ల సంఘం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. డిసెంబ‌ర్ 2వ తేదీ సాయంత్రం 5:30 గంట‌ల నుంచి డిసెంబ‌ర్ 4వ తేదీ సాయంత్రం 5:30 వ‌ర‌కు ఒపీనియ‌న్ పోల్స్‌పై నిషేధం విధించింది. గత 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏకీకృత సంస్థగా ఉన్నప్పుడు 2007 ఎన్నికల్లో విజయం సాధించింది. 2012లో విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 2017లో జరిగిన ఎన్నికల్లోనూ కమలం పార్టీ విజయం సాధించింది. 2017లో 272 వార్డులకు ఎన్నికలు జరగగా.. తూర్పు, ఉత్తరం, దక్షిణం అనే మూడు కార్పొరేషన్లలో బీజేపీ 181 సీట్లు గెలుచుకోగా, ఆప్ 49, కాంగ్రెస్ 31 స్థానాల్లో విజయం సాధించింది. కాగా ఈ సారి డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మునిసిపల్ వార్డుల సంఖ్యను 250కి తగ్గించింది. మరోవైపు.. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో తొలిసారి పాగా వేయాలని ఆశిస్తోంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఆదివారం దేశ రాజధానిలో అన్ని మార్కెట్లు మూసివేయబడతాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ ఇవాళ తెలియజేసింది. మార్కెట్‌ను మూసి ఉంచాలని మార్కెట్ యూనియన్‌లు, సీటీఐ పరస్పరం నిర్ణయించుకున్నాయని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp aap
  • Delhi
  • Delhi MCD Election 2022
  • Delhi MCD Poll 2022
  • Delhi Municipal Elections

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions