Delhi Metro Fare Hike: పెరిగిన మెట్రో ఛార్జీలు.. 8 సంవత్సరాల తర్వాత..!
- పెరిగిన డిల్లీ మెట్రో ఛార్జీలు
- ఢిల్లీ మెట్రో కనీస ఛార్జీ రూ.11
- ఢిల్లీ మెట్రో స్థానికులకు ఎంతో ఉపయోగకరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Metro Fare Hike After 8 Years: డిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) 8 సంవత్సరాల తర్వాత మెట్రో ఛార్జీలను పెంచింది. ఈ ఛార్జీల పెంపు ఈరోజు (ఆగస్టు 25) నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ఢిల్లీ మెట్రో యాజమాన్యం వెల్లడించింది. DMRC అన్ని మెట్రో లైన్లలో ఛార్జీలను రూ.1 నుంచి రూ.4 వరకు పెంచింది. అయితే ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లో మాత్రం రూ.1 నుంచి రూ.5 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఛార్జీల పెంపు తర్వాత కూడా స్మార్ట్ కార్డులను ఉపయోగించే ప్రయాణీకులకు ప్రతి ట్రిప్లో 10 శాతం తగ్గింపు, అలాగే ఆఫ్-పీక్ సమయాల్లో అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది.
దేశంలోనే అతి పొడవైన మెట్రో నెట్వర్క్ కావడంతో ఢిల్లీ మెట్రో స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. DMRC ప్రకారం, ఇప్పుడు ఢిల్లీ మెట్రో కనీస ఛార్జీ రూ.11గా, గరిష్ట ఛార్జీ రూ.64గా ఉంది. ఈ మార్పు 8 సంవత్సరాల తర్వాత చేయబడింది. ఇది లక్షలాది మంది ప్రయాణికుల ఖర్చులను ప్రభావితం చేస్తుంది. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లో ఛార్జీలు రూ.5 వరకు పెరిగాయి. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో వెల్లడించింది. ఆపరేషన్ ఖర్చు, సేవా నాణ్యతను నిర్వహించడానికి ఈ ఛార్జీల పెంపు జరిగిందని DMRC తెలిపింది.
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
Also Read: Harsh Goenka-BCCI: టీమిండియాకు జెర్సీ స్పాన్సర్ చేస్తే.. కంపెనీ మూసుకోవాల్సిందే!
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిర్వహణ వ్యయం కారణంగా ఈ చర్య తీసుకోవడం అత్యవసరం అయింది. రాఖీకి ముందు ఆగస్టు 13న ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య మెట్రో చరిత్రలోనే అత్యధికం. ఈ సంవత్సరం ఆగస్టు 13న ఒకే రోజులో 72 లక్షలకు పైగా ప్రజలు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. అయితే ఢిల్లీ మెట్రోలో ప్రతిరోజూ ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఇందుకు ఏమాత్రం తక్కువ కాదు.
తాజావార్తలు
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?