Kejriwal: ఈడీ సమన్లపై హైకోర్టులో పిటిషన్.. బుధవారం విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జారీ చేసిన ఈడీ సమన్లపై హైకోర్టులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సవాల్ చేశారు. ఈ పిటిషన్ను బుధవారం న్యాయస్థానం విచారించనుంది. ఇప్పటికే పలుమార్లు సీఎం కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఎనిమిది సార్లు ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. ఆయా కారణాల చేత విచారణకు హాజరు కాలేదు. తాజాగా మరోసారి ఆయనకు ఈడీ సమన్లు అందించింది.
తాజాగా జారీ చేసిన ఈడీ సమన్లపై కేజ్రీవాల్ హైకోర్టులో సవాల్ చేయడంతో బుధవారం హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించనుంది. గత వారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కవిత కుట్ర పన్నారని ఈడీ ఆరోపించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ-రూపకల్పనలో వీరంతా భాగస్వాములని ఈడీ వెల్లడించింది. ఇందులో భాగంగానే కవిత రూ.100 కోట్లు ముడుపులు చెల్లించాలని ఈడీ తెలిపింది. ఇకపోతే కవితకు మార్చి 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
Also Read
- Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు 2022లో వెలుగు చూసింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా 245 చోట్ల ఈడీ సోదాలు చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా సహా 15 మందిని అరెస్ట్ చేసింది. ఆరు ఛార్జ్సీట్లను కూడా నమోదు చేసింది. రూ.128 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది.
ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కేందుకే కేంద్రం ఈడీని ఉపయోగించుకుని దాడులు చేస్తోందని ఆప్ ఆరోపించింది. రాజకీయ కుట్రలో భాగంగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ ద్వారా కుట్ర జరుగుతోందని ఆప్ మంత్రులు ఇటీవల ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Man stabs wife: మధ్యాహ్న భోజనం ఆలస్యమైందని భార్యని చంపిన భర్త..
ఈడీ సమన్లపై కేజ్రీవాల్ సవాల్ చేసిన పిటిషన్ బుధవారం హైకోర్టు విచారించనుంది. ధర్మాసనం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందోనని ఆప్ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kejriwal: ఈడీ సమన్లపై హైకోర్టులో పిటిషన్.. బుధవారం విచారణ
తాజావార్తలు
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!