Delhi High Court: రూ.20 వాటర్ బాటిల్కు 100 దేనికి? .. రెస్టారెంట్ల సంఘాలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi High Court: రెస్టారెంట్ల సంఘాలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీల తీరును తప్పుబట్టింది. విక్రయించే వాటిపై ఎమ్మార్పీ కంటే ఎక్కువే తీసుకుంటున్నప్పుడు మళ్లీ అదనంగా సర్వీస్ ఛార్జీ ఎందుకు వసూలు చేస్తున్నారంటూ రెస్టారెంట్ల సంఘాలను నిలదీసింది. హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీ తప్పనిసరి కాదంటూ ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ జాతీయ రెస్టారెంట్ల సంఘం, భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల సమాఖ్య పిటిషన్ దాఖలు చేశాయి.
READ ALSO: Viral Video: వామ్మో గద్ద.. చూస్తుండగానే ఎంత పని చేసింది!
Also Read
- Bihar: షాకింగ్ నిర్ణయం.. బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ.. కారణమిదేనా?
- Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
- Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
- Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
ఈ పిటిషన్పై తాజాగా ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాననం విచారణ జరిపింది. రూ.20 వాటర్ బాటిల్కు రూ.100 వసూలు చేస్తున్నప్పుడు మళ్లీ వినియోగదారుడు విడిగా సర్వీస్ ఛార్జీ ఎందుకు చెల్లించాలని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ తీసుకుంటారా, ఆదనంగా రూ.80 ఎందుకివ్వాలని ధర్మాసనం రెస్టారెంట్ల సంఘాలను ప్రశ్నించింది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI), ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (FHRAI) తరపు న్యాయవాదిని ధర్మాసనం ఒక ఉదాహరణ ద్వారా రెస్టారెంట్లు రూ.20 వాటర్ బాటిల్కు రూ.100 వసూలు చేస్తున్నప్పుడు కస్టమర్ అది అందించే సేవలకు అదనపు ఛార్జీ ఎందుకు చెల్లించాల్సి వస్తుందని ప్రశ్నించింది.
“మీరు మీ మెనూలో రూ.20 వాటర్ బాటిల్కు రూ.100 ఎందుకు కోట్ చేస్తున్నారు. ఈ 80 రూపాయలు అదనంగా మీరు అందిస్తున్న వాతావరణానికా? ఇది కరెక్ట కాదు. మీరు MRP కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయగలరా? మీరు వసూలు చేస్తున్న రూ.80 దేనికి?” అని బెంచ్ ప్రశ్నించింది. వినియోగదారుల ఫిర్యాదులు, రెస్టారెంట్ బిల్లులను ప్రస్తావిస్తూ, సర్వీస్ ఛార్జీని ఏకపక్షంగా వసూలు చేస్తున్నారని, బలవంతంగా అమలు చేస్తున్నారని, దానిని చూస్తూ “మూగ ప్రేక్షకుడిగా” ఉండలేమని బేంచ్ స్పష్టం చేసింది. వాదనలు నమోదు చేసుకున్న కోర్టు విచారణను సెప్టెంబరు 25 వాయిదా వేసింది.
READ ALSO: Delhi murder case: ఢిల్లీలో సంచలనం.. సంచిలో డెడ్ బాడీ.. కిల్లర్ను పట్టించిన ట్యాటూ
తాజావార్తలు
-
Bihar: షాకింగ్ నిర్ణయం.. బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ.. కారణమిదేనా?
-
Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
-
Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
-
Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
-
Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!