Kejriwal: కేజ్రీవాల్ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు ఏర్పాట్లు చేయాలని పిటిషన్.. లక్ష జరిమానా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi High Court: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన వార్తలను నిషేధించాలని కూడా పిటిషన్లో డిమాండ్ చేశారు. ఈ పిల్ ను కోర్టు తిరస్కరించడమే కాకుండా పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.
Read Also: Madhyapradesh : ముందు గుడికి దండంపెట్టాడు.. తర్వాత బాంబులు వేశాడు
Also Read
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
కాగా, శ్రీకాంత్ ప్రసాద్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, కేబినెట్ సభ్యులతో కేజ్రీవాల్ మాట్లాడేందుకు వీలుగా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని జైలు డీజీని ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాలతో కూడిన ధర్మాసనం పిటిషన్ను తిరస్కరించి శ్రీకాంత్ ప్రసాద్ అనే న్యాయవాదికి రూ.లక్ష జరిమానా కూది విధించింది. ఎయిమ్స్ ఖాతాలో జమ చేయాలని పిటిషనర్ను కోరారు. పిటిషనర్ను కోర్టు మందలించడంతో పాటు పలు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది.
Read Also: Komatireddy Venkat Reddy: మాది RR కాదు.. మీది AA.. మోడీకి కోమటిరెడ్డి సెటైర్
ఇక, ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా, రాష్ట్రపతి పాలనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయకుండా మీడియాను నిలిపివేయాలని పిటిషన్లో శ్రీకాంత్ ప్రసాద్ డిమాండ్ చేశారు. దీనిపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఎమర్జెన్సీ విధించాలా లేక మిలటరీ పాలన విధించాలా అని ప్రశ్నించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21వ తేదీ నుంచి జైలులో ఉన్నారు. ఆరోపించిన మద్యం కుంభకోణంలో అరెస్టైన కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని పట్టుదలగా ఉన్నారు. తమ అధినేత సీఎం పదవికి రాజీనామా చేయరని, జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది.
తాజావార్తలు
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!