Delhi murder case: ఢిల్లీలో సంచలనం.. సంచిలో డెడ్ బాడీ.. కిల్లర్ను పట్టించిన ట్యాటూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi murder case: దేశ రాజధానిలో సంచలన ఘటన వెలుగుచూసింది. ఢిల్లీలోని దాబ్రీ ప్రాంతంలో ఒక యువతి మృతదేహం గోనె సంచిలో కనిపించడంతో ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించడం మొదలు పెట్టారు. ఈక్రమంలో నిందితుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన సలీంగా గుర్తించి అరెస్టు చేశారు.
READ ALSO: allergy death: అలర్జీ ఎంత పని చేసిందంటే.. 22 ఏళ్ల అమ్మాయి 24 గంటల్లో మృతి
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
అసలు ఏం జరిగిందంటే..
ఈసందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఆగస్టు 23 మధ్యాహ్నం 2:54 గంటల ప్రాంతంలో ద్వారకా-దబ్రీ ప్రాంతంలోని డ్రెయిన్ దగ్గర అనుమానాస్పద సంచి దొరికిందని దబ్రీ పోలీస్ స్టేషన్కు సమాచారం వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ సంచిలో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలిని(20) ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు సహాయంతో గుర్తించినట్లు తెలిపారు. ఆమె ఆగస్టు 21న తప్పిపోయినట్లు మృతిరాలి తల్లి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక నిఘా ఆధారంగా సలీంను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు మృతురాలితో కలిసి ఒక భవనంలోకి ప్రవేశించి, తరువాత ఒంటరిగా వెళ్లిపోయాడని, ఆమె శరీరాన్ని ఒక సంచిలో మోసుకెళ్లడం ఫుటేజ్లో కనిపించిందని పేర్కొన్నారు. మృతి చెందిన అమ్మాయికి నిందితుడు సలీంకు ముందు నుంచీ పరిచయం ఉందని, ఆమె ఆగస్టు 21న సలీంను కలవడానికి వెళ్లిందన్నారు. అప్పుడు ఆ అమ్మాయి నిందితుడిని తన దగ్గరి నుంచి గతంలో తీసుకున్న డబ్బు ఇవ్వాలని అడిగిందని, దీంతో వాళ్లిద్దరి మధ్య డబ్బు విషయంలో వాగ్వాదం జరిగి, కోపంతో సలీం ఆమెను గొంతు కోసి చంపాడని తెలిపారు. హత్య తర్వాత నిందితుడు మృతదేహాన్ని ఒక సంచిలో వేసి తన బైక్పై తీసుకెళ్లి దాబ్రీ సమీపంలోని కాల్వలో పడేయడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో మృతదేహం జారిపడి రోడ్డుపైన వెళ్లే వారి దృష్టిని ఆకర్షించింది. వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
యూపీలో అరెస్టు..
నిందితుడిని పట్టుకోవడానికి అనేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. హార్డయ్లో నిందితుడు ఉన్నట్లు సమాచారం రావడంతో వెంటనే పోలీసులు బృందాలు అక్కడికి వెళ్లి అతన్ని అరెస్టు చేశాయి. నిందితుడిని పట్టించడంలో బాలిక చేతిలో ఉన్న పచ్చబొట్టు కీ రోల్ ప్లే చేసిందని అధికారులు తెలిపారు.
READ ALSO: TMC MLA escapes ED: ఈడీకి భయపడి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన ఎమ్మెల్యే..
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!