Delhi: ‘మేడమ్ మీరు చాలా అందగా ఉన్నారు.. మీరు ఓకే అంటే..’ ఇన్స్టాలో 50 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ కి మెసేజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఓ అవమానకర ఘటన చోటు చేసుకుంది. 50 ఏళ్ల కానిస్టేబుల్ కి ఇన్స్టాలో ఒక సందేశం వచ్చింది. పంపిన వ్యక్తి ఆమె కారు నంబర్, మొబైల్ నంబర్ను సైతం మెసేజ్ ద్వారా తెలియజేశాడు. అంటే కాకుండా “నువ్వు చాలా అందంగా ఉన్నావు. మనం స్నేహితులుగా ఉండగలమా?” అని సందేశం పంపాడు. దీంతో ఆమె మెసేజ్ చేసిన వ్యక్తిని మందలించింది. సైబర్ క్రైమ్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో ఆసక్తికరమైన విషయం తెలిసింది. 50 ఏళ్ల కానిస్టేబుల్ కి మెసేజ్ చేసింది.. మరో స్టేషన్ లో పని చేస్తున్న తోటి కానిస్టేబుల్ అని తేలింది. అసలు ఏం జరిగిందంటే..
READ MORE: China – Pakistan: పాక్కు చైనా షాక్! టీటీపీకి డ్రాగన్ ఆయుధాలు..
Also Read
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
బాధితురాలైన మహిళా కానిస్టేబుల్ గురుగ్రామ్లోని సెక్టార్ 45లో నివసిస్తోంది. సెప్టెంబర్ 14వ తేదీ తెల్లవారుజామున 12:30 గంటల ప్రాంతంలో తన కారులో ఆర్డి సిటీ గేట్ నంబర్ 2 నుంచి ఇంటికి బయలుదేరింది. ఆమె ఇంటికి చేరుకున్న వెంటనే.. సిమ్రాన్ చోప్రా అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి 1:45 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ వ్యక్తి స్నేహపూర్వకంగా మెసేజ్ చేయడం ప్రారంభించాడు. “మేడమ్, మీరు ఈ గేట్ నంబర్ నుంచి టాటా పంచ్ కారులో వెళ్లిపోయారు కదూ..” అని సందేశం పంపాడు. ఆశ్చర్యపోయిన ఆ మహిళ, “అవును, కానీ మీరు నన్ను ఇంత రాత్రి ఎలా గుర్తుపట్టారు?” అని జవాబిచ్చింది. అవతలి వ్యక్తి, ” మేడమ్ మీరు చాలా అందంగా ఉన్నారు. మనం స్నేహితులుగా ఉండగలమా?” అని సందేశం పంపాడు. అసలు తన కారు, ఇన్స్టాగ్రామ్ ఖాతా తదితర వివరాలు ఈ గుర్తు తెలియని వ్యక్తికి ఎలా తెలిసిందని ఆమె ఆశ్చర్యపోయింది.
READ MORE: RRB Recruitment 2025: రైల్వేలో ఉద్యోగాల జాతర.. ఏకంగా 8,875 పోస్టులు.. అస్సలు వదులుకోకండి..
దీంతో ఆమె ఆ వ్యక్తిని మందలించడమే కాకుండా సైబర్ క్రైమ్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో నిందితుడు మరెవరో కాదు, ఈవీఆర్ లో పోస్ట్ చేయబడిన కానిస్టేబుల్ విజయ్ అని తేలింది. అయితే అంతకు ముందు సైబర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు.. అక్కడి పోలీసు సిబ్బంది, అధికారుల వైఖరిపై వాపోయింది. బాధితురాలి ప్రకారం.. వారు ఆమె చేసిన ఫిర్యాదును స్వీకరించే ముందు నవ్వి, “మిమ్మల్ని ఆయన వేధించలేదు; వారు స్నేహం కోసం మాత్రమే అడిగారు. ఆ ఖాతాను బ్లాక్ చేస్తే సరిపోతుంది కదా..” అని సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని బాధితురాలు సోషల్ మీడియాలో వీడియో రూపంలో పోస్ట్ చేసింది. స్పందించిన ఉన్నతాధికారులు నిందితుడైన కానిస్టేబుల్ విజయ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అతడిని సస్పెండ్ చేశారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్తో రాబోతున్నాడా?
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!