Tufail Ahmad Arrest: ఢిల్లీ కారు పేలుడు కేసులో మరొకరు అరెస్ట్.. SIA అదుపులో ఎలక్ట్రీషియన్
- పుల్వామాకు చెందిన తుఫైల్ అహ్మద్ అరెస్ట్..
- ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్న తుఫైల్ అహ్మద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tufail Ahmad Arrest: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA), స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) శనివారం ఢిల్లీ కారు పేలుడు కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు. పుల్వామా నివాసి అయిన తుఫైల్ అహ్మద్ను దర్యాప్తు బృందాలు అరెస్టు చేశాయి. తుఫైల్ అక్కడి ఒక పారిశ్రామిక ఎస్టేట్లో పనిచేసే ఎలక్ట్రీషియన్. ఇప్పటికే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ టెర్రర్ మాడ్యూల్లో తుఫైల్ పాత్ర గతంలో నమ్మిన దానికంటే చాలా విస్తృతమైనదని సూచించే ఆధారాలు లభించాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. తుఫైల్ ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు, ఆయన కార్యకలాపాలు, ఢిల్లీ కారు బాంబు దాడిలో పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలపై ఏజెన్సీలు నిశితంగా దర్యాప్తు చేస్తున్నాయి.
READ ALSO: Maoists: మావోయిస్టుల మృతదేహాలకు ముగిసిన పోస్టుమార్టం..
Also Read
- Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
- DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- Tamil Nadu: విజయ్కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
దర్యాప్తులో ఏం తేలిందంటే..
జైష్-ఎ-మొహమ్మద్తో ముడిపడి ఉన్న ఈ అంతర్రాష్ట్ర నెట్వర్క్ను ఇప్పటికే SIA, SOG బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. తుఫైల్ అరెస్టు అనేది ఈ ఆపరేషన్లో భాగంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఈ నెట్వర్క్ను అర్థం చేసుకోవడానికి, కుట్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ గుర్తించడానికి పని చేస్తున్నట్లు దర్యాప్తు బృందాలు తెలిపాయి. ఇప్పుడు పోలీసులు, దర్యాప్తు సంస్థలు తుఫైల్కు వ్యతిరేకంగా అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. ఢిల్లీ పేలుళ్ల కుట్రలో పాల్గొన్న అందరిని బయటికి తీసుకురావడమే లక్ష్యం పని చేస్తున్నట్లు తెలిపారు.
దాడి ఎప్పుడు జరిగిందంటే..
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నవంబర్ 10న ఒక శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇందులో ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో సహా కనీసం 14 మంది మరణించారు. ఆత్మాహుతి బాంబర్ నడుపుతున్న తెల్లటి హ్యుందాయ్ i20 కారులో ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ఆత్మాహుతి బాంబర్కు ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంతో సంబంధం ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ పేలుడు బహుళ ప్రదేశాలపై దాడి చేయడానికి జరిగిన పెద్ద కుట్రలో భాగమా అనే కొణంలో దర్యాప్తు సంస్థలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయి. ఈ మొత్తం పథకం కోసం నిందితులు స్వయంగా డబ్బును సేకరించారని సమాచారం.
READ ALSO: Adani Group: ఆరేళ్లలో ఆరు ప్రధాన కంపెనీలను కొన్న అదానీ.. అవి ఏంటో తెలుసా!
తాజావార్తలు
-
Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
-
DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
-
Peddi : థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి!
-
CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
-
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!