Tufail Ahmad Arrest: ఢిల్లీ కారు పేలుడు కేసులో మరొకరు అరెస్ట్.. SIA అదుపులో ఎలక్ట్రీషియన్
- పుల్వామాకు చెందిన తుఫైల్ అహ్మద్ అరెస్ట్..
- ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్న తుఫైల్ అహ్మద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tufail Ahmad Arrest: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA), స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) శనివారం ఢిల్లీ కారు పేలుడు కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు. పుల్వామా నివాసి అయిన తుఫైల్ అహ్మద్ను దర్యాప్తు బృందాలు అరెస్టు చేశాయి. తుఫైల్ అక్కడి ఒక పారిశ్రామిక ఎస్టేట్లో పనిచేసే ఎలక్ట్రీషియన్. ఇప్పటికే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ టెర్రర్ మాడ్యూల్లో తుఫైల్ పాత్ర గతంలో నమ్మిన దానికంటే చాలా విస్తృతమైనదని సూచించే ఆధారాలు లభించాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. తుఫైల్ ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు, ఆయన కార్యకలాపాలు, ఢిల్లీ కారు బాంబు దాడిలో పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలపై ఏజెన్సీలు నిశితంగా దర్యాప్తు చేస్తున్నాయి.
READ ALSO: Maoists: మావోయిస్టుల మృతదేహాలకు ముగిసిన పోస్టుమార్టం..
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
దర్యాప్తులో ఏం తేలిందంటే..
జైష్-ఎ-మొహమ్మద్తో ముడిపడి ఉన్న ఈ అంతర్రాష్ట్ర నెట్వర్క్ను ఇప్పటికే SIA, SOG బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. తుఫైల్ అరెస్టు అనేది ఈ ఆపరేషన్లో భాగంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఈ నెట్వర్క్ను అర్థం చేసుకోవడానికి, కుట్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ గుర్తించడానికి పని చేస్తున్నట్లు దర్యాప్తు బృందాలు తెలిపాయి. ఇప్పుడు పోలీసులు, దర్యాప్తు సంస్థలు తుఫైల్కు వ్యతిరేకంగా అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. ఢిల్లీ పేలుళ్ల కుట్రలో పాల్గొన్న అందరిని బయటికి తీసుకురావడమే లక్ష్యం పని చేస్తున్నట్లు తెలిపారు.
దాడి ఎప్పుడు జరిగిందంటే..
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నవంబర్ 10న ఒక శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇందులో ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో సహా కనీసం 14 మంది మరణించారు. ఆత్మాహుతి బాంబర్ నడుపుతున్న తెల్లటి హ్యుందాయ్ i20 కారులో ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ఆత్మాహుతి బాంబర్కు ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంతో సంబంధం ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ పేలుడు బహుళ ప్రదేశాలపై దాడి చేయడానికి జరిగిన పెద్ద కుట్రలో భాగమా అనే కొణంలో దర్యాప్తు సంస్థలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయి. ఈ మొత్తం పథకం కోసం నిందితులు స్వయంగా డబ్బును సేకరించారని సమాచారం.
READ ALSO: Adani Group: ఆరేళ్లలో ఆరు ప్రధాన కంపెనీలను కొన్న అదానీ.. అవి ఏంటో తెలుసా!
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?