Delhi: తప్పిపోయిన కొడుకు 22 ఏళ్లకు తిరిగొచ్చాడు.. ఆ తర్వాత ఏం షాకిచ్చాడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లి అనే ఈ రెండు అక్షరాల్లోనే ప్రేమ ఉంటుంది. తల్లి ప్రేమను ఈ లోకంలో ఎవరు అందించలేరు. తల్లి బిడ్డల బాంధవ్యం విడదీయరానిది. కష్టమొచ్చినా.. దుఖమొచ్చినా.. ఏం సమస్య వచ్చినా ముందుగా చెప్పుకునేది తల్లితోనే. కుటుంబంలో తల్లితోనే ఎక్కువ అనురాగం ఉంటుంది. ఇది ఎవరు కాదన్నా.. అవునన్నా.. ఇది నిజం. పేగుతెంచుకుని పుట్టిన కన్నబిడ్డ తప్పిపోయి 22 ఏళ్లు గడిచిపోయింది. బిడ్డ రాక కోసం కళ్లుకాయలు కాసేలా ఆ మాతృమూర్తి ఎదురుచూసింది. ఆమె నిరీక్షణ 22 ఏళ్ల తర్వాత ఫలించింది. తన కడుపున పుట్టిన బిడ్డే కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. చెప్పలేనంత సంతోషం. కానీ అంతలోనే అది ఆవిరైపోయింది. తనయుడు ఇచ్చిన షాక్తో దుఖం కట్టలు తెంచుకొచ్చింది. ఈ హృదయ విదారకరమైన ఘటన ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) చోటుచేసుకుంది.
11 ఏళ్ల పింకు తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలో (Delhi) నివాసం ఉండేవాడు. తల్లిదండ్రులు ఏదో చిన్న మాట అన్నారని ఇంట్లో నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. బిడ్డ రాక కోసం ఎదురుచూసి.. చూసి ఆశలు వదులుకున్నారు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
కానీ పింకు (Delhi boy) మాత్రం 22 ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ వారి స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని అమేథీ జల్లా ఖరౌలి గ్రామానికి చేరుకున్నాడు. దీంతో గ్రామస్థులంతా షాక్ అయ్యారు. ఈ సమాచారాన్ని ఢిల్లీలో ఉంటున్న తల్లిదండ్రులకు చేరవేశారు. హుటాహుటినా కొడుకు దగ్గరకు చేరుకున్నారు. ఒంటిపై ఉన్న పుట్టిమచ్చలు చూసి.. వచ్చింది తమ బిడ్డేనని ఆ పేరెంట్స్ ఎంతగానో సంతోషించారు. కానీ తనయుడి యొక్క వస్త్రధారణ.. ఆహార్యాన్ని చూసి ఆ తల్లిదండ్రుల మనసు కృంగిపోయింది. కొడుకు జానపద కథలు చెబుతూ ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో రాజులాగా బ్రతకాల్సిన కొడుకు ఇలా మారిపోయాడేంటి? అంటూ ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది.
ఓ వైపు బిడ్డ వచ్చాడన్న ఆనందం.. ఇంకోవైపు బిడ్డ యొక్క ధీనస్థితి.. ఇలా ఆ తల్లిదండ్రులు ఎంతగానో మానసిక సంఘర్షణకు గురయ్యారు. ఏదేమైతే మా బిడ్డ మాకు దక్కాడంటూ ఆ తల్లి మురిసిపోయింది. కానీ పింకూ మాత్రం కోలుకోలేని షాకిచ్చాడు. తాను తల్లిదండ్రులతో కలిసి ఉండలేనంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆ తల్లిదండ్రుల వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. ఈ సంఘటనతో గ్రామస్థులు కూడా చలించిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!