Delhi: తప్పిపోయిన కొడుకు 22 ఏళ్లకు తిరిగొచ్చాడు.. ఆ తర్వాత ఏం షాకిచ్చాడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లి అనే ఈ రెండు అక్షరాల్లోనే ప్రేమ ఉంటుంది. తల్లి ప్రేమను ఈ లోకంలో ఎవరు అందించలేరు. తల్లి బిడ్డల బాంధవ్యం విడదీయరానిది. కష్టమొచ్చినా.. దుఖమొచ్చినా.. ఏం సమస్య వచ్చినా ముందుగా చెప్పుకునేది తల్లితోనే. కుటుంబంలో తల్లితోనే ఎక్కువ అనురాగం ఉంటుంది. ఇది ఎవరు కాదన్నా.. అవునన్నా.. ఇది నిజం. పేగుతెంచుకుని పుట్టిన కన్నబిడ్డ తప్పిపోయి 22 ఏళ్లు గడిచిపోయింది. బిడ్డ రాక కోసం కళ్లుకాయలు కాసేలా ఆ మాతృమూర్తి ఎదురుచూసింది. ఆమె నిరీక్షణ 22 ఏళ్ల తర్వాత ఫలించింది. తన కడుపున పుట్టిన బిడ్డే కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. చెప్పలేనంత సంతోషం. కానీ అంతలోనే అది ఆవిరైపోయింది. తనయుడు ఇచ్చిన షాక్తో దుఖం కట్టలు తెంచుకొచ్చింది. ఈ హృదయ విదారకరమైన ఘటన ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) చోటుచేసుకుంది.
11 ఏళ్ల పింకు తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలో (Delhi) నివాసం ఉండేవాడు. తల్లిదండ్రులు ఏదో చిన్న మాట అన్నారని ఇంట్లో నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. బిడ్డ రాక కోసం ఎదురుచూసి.. చూసి ఆశలు వదులుకున్నారు.
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
కానీ పింకు (Delhi boy) మాత్రం 22 ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ వారి స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని అమేథీ జల్లా ఖరౌలి గ్రామానికి చేరుకున్నాడు. దీంతో గ్రామస్థులంతా షాక్ అయ్యారు. ఈ సమాచారాన్ని ఢిల్లీలో ఉంటున్న తల్లిదండ్రులకు చేరవేశారు. హుటాహుటినా కొడుకు దగ్గరకు చేరుకున్నారు. ఒంటిపై ఉన్న పుట్టిమచ్చలు చూసి.. వచ్చింది తమ బిడ్డేనని ఆ పేరెంట్స్ ఎంతగానో సంతోషించారు. కానీ తనయుడి యొక్క వస్త్రధారణ.. ఆహార్యాన్ని చూసి ఆ తల్లిదండ్రుల మనసు కృంగిపోయింది. కొడుకు జానపద కథలు చెబుతూ ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో రాజులాగా బ్రతకాల్సిన కొడుకు ఇలా మారిపోయాడేంటి? అంటూ ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది.
ఓ వైపు బిడ్డ వచ్చాడన్న ఆనందం.. ఇంకోవైపు బిడ్డ యొక్క ధీనస్థితి.. ఇలా ఆ తల్లిదండ్రులు ఎంతగానో మానసిక సంఘర్షణకు గురయ్యారు. ఏదేమైతే మా బిడ్డ మాకు దక్కాడంటూ ఆ తల్లి మురిసిపోయింది. కానీ పింకూ మాత్రం కోలుకోలేని షాకిచ్చాడు. తాను తల్లిదండ్రులతో కలిసి ఉండలేనంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆ తల్లిదండ్రుల వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. ఈ సంఘటనతో గ్రామస్థులు కూడా చలించిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!