Delhi Blast Case: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో I-20 కారు యజమాని అరెస్ట్..
- ఉమర్ ఉన్ నబీ కలిసి దాడికి ప్లాన్
- కారు కొనుగోలు చేసిన అమీర్ రషీద్ అలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Blast Case: ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో జరిగిన కార్ బాంబు పేలుడు కేసులో NIA (జాతీయ దర్యాప్తు సంస్థ) ఒక పెద్ద పురోగతిని సాధించింది. ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నిన వ్యక్తిని ఈ ఏజెన్సీ అరెస్టు చేసింది. NIA అరెస్ట్ చేసిన నిందితుడి పేరు అమీర్ రషీద్ అలీ. ఈ పేలుడుకు ఉపయోగించిన కారు అతని పేరు మీద రిజిస్టర్ అయ్యింది. NIA అతన్ని ఢిల్లీలో అరెస్టు చేసింది. ఈ పేలుడుపై మొదట ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేయగా, తర్వాత కేసును NIAకి అప్పగించారు. కేసును స్వాధీనం చేసుకున్న తర్వాత NIA సర్చ్ ఆపరేషన్ ప్రారంభించి అమీర్ను అరెస్టు చేసింది.
READ ALSO: Tej Pratap Yadav: ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన లాలూ యాదవ్ కొడుకు!
Also Read
- Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
- Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
- Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
- Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే 'అగ్ని పరీక్ష'!
అమీర్ అరెస్ట్..
జమ్మూ కాశ్మీర్లోని పాంపోర్లోని సంబురాకు చెందిన వ్యక్తి అమీర్. ఆయన పుల్వామాకు చెందిన ఉమర్ ఉన్ నబీ అనే వ్యక్తితో కలిసి ఈ దాడికి ప్రణాళిక వేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దాడికి ఉపయోగించిన కారును కొనుగోలు చేయడంలో సహాయం చేయడానికి అమీర్ ఢిల్లీకి వచ్చాడు, తరువాత దానిని పేలుడు కోసం IED (బాంబు తయారీ పరికరం)గా ఉపయోగించారని ఎన్ఐఏ తెలిపింది. ఫోరెన్సిక్ దర్యాప్తుల ద్వారా, పేలుడు జరిగిన సమయంలో కారులో ఉన్న డ్రైవర్ను NIA గుర్తించింది. అతన్ని ఉమర్ ఉన్ నబీగా వెల్లడించింది. పుల్వామా నివాసి అయిన ఉమర్, హర్యానాలోని ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు.
కొనసాగుతున్న ముమ్మర దర్యాప్తు ..
ఒమర్ ఉన్ నబీకి చెందిన మరో వాహనాన్ని కూడా NIA స్వాధీనం చేసుకుంది. మరిన్ని ఆధారాలను సేకరించడానికి ఆ వాహనాన్ని ఇప్పుడు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 10న ఢిల్లీలో జరిగిన పేలుడులో గాయపడిన వారితో సహా ఇప్పటివరకు 73 మంది సాక్షులను ఈ ఏజెన్సీ ప్రశ్నించింది. ఢిల్లీ , జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఇతర ఏజెన్సీల సహకారంతో NIA ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. పేలుడులో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలను, వారి కుట్రలను గుర్తించడానికి దర్యాప్తు సంస్థ ఇప్పుడు ముమ్మర దర్యాప్తు చేస్తుంది. కేసును కేసు నంబర్ RC-21/2025/NIA/DLI కింద నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు రాష్ట్రం నుంచి రాష్ట్రానికి విస్తరిస్తుంది.
READ ALSO: Varanasi : వామ్మో.. వారణాసి ఈవెంట్ కు అన్ని కోట్లు పెట్టారా..?
తాజావార్తలు
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!