Defamation Notice: ఢిల్లీ మంత్రి అతిషికి బీజేపీ పరువు నష్టం నోటీసు..
ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి అతిషిపై బీజేపీ పరువు నష్టం దావా కింద నోటీసులు జారీ చేసింది. ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీలో చేరాలని.. లేదంటే అరెస్టు తప్పదని ఓ కమలం పార్టీ నేత తనను అడిగినట్లు ఆమె నిన్న ( మంగళవారం ) ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనతో పాటు మరో ముగ్గురు ఆప్ వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తారని పేర్కొనింది. ఈడీ అధికారుల అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరాలని ఓ వ్యక్తి తనను ఆశ్రయించినట్లు ఆమె చెప్పుకొచ్చారు.
Read Also: CM YS Jagan: నేను విన్నాను, నేను ఉన్నాను.. పెరాలసిస్ బాధితుడికి సీఎం జగన్ భరోసా!
Also Read
అయితే, మంత్రి అతిషికి డిఫమేషన్ నోటీసు పంపామని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ చెప్పారు. తనను ఎవరు ఆశ్రయించారు.. ఎప్పుడు ఆ ఘటన జరిగింది.. దానికి సంబంధించిన సాక్ష్యాలను అతిషి ఇవ్వలేకపోయినట్లు ఆయన ఆరోపణలు చేశారు. తన ఆరోపణలను ప్రూవ్ చేసేందుకు ఫోన్ను దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ సచ్దేవ్ కోరారు. అయితే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆప్ నేతలను బీజేపీ టార్గె్ట్ గా చేసుకుందని మంత్రి అతిషి వెల్లడించింది.
తాజావార్తలు
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!