Site icon NTV Telugu

Delhi Air Pollution News : కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నవంబర్ 10వరకు అన్నీ బంద్

New Project 2023 11 05t105303.476

New Project 2023 11 05t105303.476

Delhi Air Pollution News : దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్న దృష్ట్యా ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఆదివారం తెలిపారు. ఈ సమయంలో పాఠశాలలు 6 నుండి 12 తరగతులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని సూచించారు.

ఢిల్లీ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ ఢిల్లీలో అధిక స్థాయికి వాయు కాలుష్యం చేరుకుందన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కాలుష్యం ముఖ్యంగా ఇది పిల్లలకు చాలా హానికరం కావొచ్చు. వాయు కాలుష్యం దృష్ట్యా, ఢిల్లీ ప్రభుత్వం 2023 నవంబర్ 10 నాటికి ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది.

Read Also:Nani : స్టూడెంట్ అడిగిన ఆ ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన నాని..

Read Also:Google Pixel 8 Pro: గూగుల్ పిక్సెల్‌ 8ప్రో నుంచి కొత్త వేరియంట్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

Exit mobile version