Diwali Shubh Muhurat 2023: లక్ష్మీదేవిని పూజించే శుభ సమయం ఇదే.. విశేష ఫలితాలు మీ సొంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 Diwali Puja ka Sahi Samay: హిందూ క్యాలెండర్ ప్రకారం… ‘దీపావళి’ పండుగను ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు. హిందూ గ్రంధాలలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున లక్ష్మీదేవి, గణేశుడిని పూజించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. దీపావళి రోజున సరైన సమయంలో పూజలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. దీపావళి రాత్రి మహాలక్ష్మి భూమిపై సంచరిస్తుందని, మనస్ఫూర్తిగా పూజించే వారి ఇళ్లలో శాశ్వతంగా నివసిస్తుందని నమ్ముతారు.
గ్రంధాల ప్రకారం.. దీపావళి నాడు లక్ష్మీదేవి నుంచి సంపద మరియు శ్రేయస్సు పొందాలనుకునేవారు శుభ సమయంలో పూజ చేయాలి. దీపావళి పూజను శుభ సమయంలో చేసి.. లక్ష్మ దేవిని పూజిస్తే ఖచ్చితంగా ఆమె ఇంట్లోకి ప్రవేశిస్తుంది. 12 నవంబర్ దీపావళి 2023 సాయంత్రం ఏ సమయంలో ఐశ్వర్య దేవతను పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
- Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
- BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
దీపావళి పండుగ కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈసారి దీపావళిని దేశవ్యాప్తంగా నవంబర్ 12న జరుపుకుంటున్నారు. ఈసారి కార్తీక అమావాస్య నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం 2:57 గంటల వరకు కొనసాగుతుంది.
ఈసారి దీపావళి నాడు లక్ష్మీ పూజను రెండు శుభ సమయాల్లో చేయవచ్చు. మొదటి శుభ ముహూర్తం నవంబర్ 12 (ప్రదోష కాలం) సాయంత్రం 5.28 నుంచి ప్రారంభమై రాత్రి 8.07 వరకు ఉంటుంది. ఈ కాలంలో పూజలు చేయడం ఉత్తమం. రెండవ శుభ సమయం (నిషిత్ కాల్) రాత్రి 11:39 నుండి 12:32 వరకు ఉంది. లక్ష్మీ పూజ కోసం ఇవి శుభ సమయాలు.
Also Read: Diwali Remedies 2023: దీపావళి రోజున రూపాయి నాణెంతో ఈ పరిహారం చేస్తే.. ప్రతి పనిలో విజయమే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. లక్ష్మీ పూజ చేస్తే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోడు. లక్ష్మీ దేవిని తెలుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరించి పూజించాలి. గులాబీ తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని పూజిస్తే మంచిది. దీపావళి ఆరాధన సమయంలో లక్ష్మీదేవికి కమల పువ్వును సమర్పించడం ఉత్తమమైనది. ఇలా చేయడం వలన విశేష ఫలితాలు మీ సొంతం అవుతాయి.
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?