Diwali Shubh Muhurat 2023: లక్ష్మీదేవిని పూజించే శుభ సమయం ఇదే.. విశేష ఫలితాలు మీ సొంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 Diwali Puja ka Sahi Samay: హిందూ క్యాలెండర్ ప్రకారం… ‘దీపావళి’ పండుగను ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు. హిందూ గ్రంధాలలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున లక్ష్మీదేవి, గణేశుడిని పూజించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. దీపావళి రోజున సరైన సమయంలో పూజలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. దీపావళి రాత్రి మహాలక్ష్మి భూమిపై సంచరిస్తుందని, మనస్ఫూర్తిగా పూజించే వారి ఇళ్లలో శాశ్వతంగా నివసిస్తుందని నమ్ముతారు.
గ్రంధాల ప్రకారం.. దీపావళి నాడు లక్ష్మీదేవి నుంచి సంపద మరియు శ్రేయస్సు పొందాలనుకునేవారు శుభ సమయంలో పూజ చేయాలి. దీపావళి పూజను శుభ సమయంలో చేసి.. లక్ష్మ దేవిని పూజిస్తే ఖచ్చితంగా ఆమె ఇంట్లోకి ప్రవేశిస్తుంది. 12 నవంబర్ దీపావళి 2023 సాయంత్రం ఏ సమయంలో ఐశ్వర్య దేవతను పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
దీపావళి పండుగ కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈసారి దీపావళిని దేశవ్యాప్తంగా నవంబర్ 12న జరుపుకుంటున్నారు. ఈసారి కార్తీక అమావాస్య నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం 2:57 గంటల వరకు కొనసాగుతుంది.
ఈసారి దీపావళి నాడు లక్ష్మీ పూజను రెండు శుభ సమయాల్లో చేయవచ్చు. మొదటి శుభ ముహూర్తం నవంబర్ 12 (ప్రదోష కాలం) సాయంత్రం 5.28 నుంచి ప్రారంభమై రాత్రి 8.07 వరకు ఉంటుంది. ఈ కాలంలో పూజలు చేయడం ఉత్తమం. రెండవ శుభ సమయం (నిషిత్ కాల్) రాత్రి 11:39 నుండి 12:32 వరకు ఉంది. లక్ష్మీ పూజ కోసం ఇవి శుభ సమయాలు.
Also Read: Diwali Remedies 2023: దీపావళి రోజున రూపాయి నాణెంతో ఈ పరిహారం చేస్తే.. ప్రతి పనిలో విజయమే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. లక్ష్మీ పూజ చేస్తే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోడు. లక్ష్మీ దేవిని తెలుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరించి పూజించాలి. గులాబీ తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని పూజిస్తే మంచిది. దీపావళి ఆరాధన సమయంలో లక్ష్మీదేవికి కమల పువ్వును సమర్పించడం ఉత్తమమైనది. ఇలా చేయడం వలన విశేష ఫలితాలు మీ సొంతం అవుతాయి.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..