Hawaii Wildfires: హవాయి దీవుల కార్చి చ్చులో 100కి చేరిన మృతులు.. 2200 భవనాలు నాశనం
Hawaii Wildfires: అమెరికాలోని హవాయి దీవుల్లో చెలరేగిన కార్చిచ్చులో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం వరకే 100 మందికిపైగా మృతి చెందినట్టు అమెరికా అధికారిక వర్గాలు ప్రకటించాయి. కార్చిచ్చుతో వేలాది మంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. సుమారు 2200 పైగా భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కార్చిచ్చు నివారణలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. శవాల కోసం శవ కుక్కలతో రికవరీ సిబ్బంది వందలాది గృహాలల్లో పరిశీలన చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. లహైనాలో వాహనాలను తగలబడటం వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
- Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
- Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
మౌయి ద్వీపంలోని చారిత్రక తీర పట్టణం బుధవారం తెల్లవారుజామున కార్చిచ్చులో తగులబడి దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. కార్చిచ్చు సమయంలో ద్వీపంలోని సైరన్లు ఏవీ ఎందుకు యాక్టివేట్ చేయలేదని మీడియా ప్రశ్నించగా.. హవాయి సెనేటర్ మజీ హిరోనో రాష్ట్ర అటార్నీ జనరల్ ప్రకటించిన దర్యాప్తు ఫలితాల కోసం వేచి చూస్తాన్నమని చెప్పారు. జరిగిన విషాదానికి నేను ఎటువంటి సాకులు చెప్పబోనని డెమొక్రాట్ అయిన హిరోనో మీడియాకు చెప్పారు. రెస్క్యూ పనులు ఇంకా వేగంగా నిర్వహించడంపై, మృతదేహాలను వెతకడంలో దృష్టి సారించినట్టు తెలిపారు. లాహైనాలో మంటలు చెలరేగడంతో 2,200 కంటే ఎక్కువ భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. అధికారిక అంచనాల ప్రకారం 5.5 బిలియన్ల అమెరికా డాలర్ల నష్టం వాటిల్లిందని.. కార్చిచ్చు మూలంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. శవ కుక్కలతో ఇప్పటికీ వందలాది మంది వ్యక్తుల కోసం వెతకడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పెల్లెటియర్ చెప్పారు. వీలయినంత వేగంగా పరిశోధిస్తున్నట్టు చెప్పారు. నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ప్రకారం, మిన్నెసోటా మరియు విస్కాన్సిన్లలో 453 మంది మరణించిన తర్వాత 1918 నుండి అమెరికాలో ఇప్పుడు సంభవించిన కార్చి్చ్చే అత్యంత ఘోరమైనదని తెలిపారు. 2018లో కాలిఫోర్నియాలోని క్యాంప్ ఫైర్ను అధిగమించిందని.. చిన్న పట్టణమైన ప్యారడైజ్ను తుడిచిపెట్టిందని.. ఆ ప్రమాదంలో 86 మంది మరణించారని తెలిపారు. ద్వీపాలు సునామీలు, భూకంపాలు మరియు హింసాత్మక తుఫానుల వంటి సహజ విపత్తులకు గురైనప్పటికీ, విపత్తు కోసం అధికారులు ఎలా సన్నద్ధమయ్యారు అనే ప్రశ్నలు అడుగుతున్నారు.
తాజావార్తలు
-
Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
-
TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
-
Cigarette Price Hike: సిగరెట్ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
-
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?