Hawaii Wildfires: హవాయి దీవుల కార్చి చ్చులో 100కి చేరిన మృతులు.. 2200 భవనాలు నాశనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hawaii Wildfires: అమెరికాలోని హవాయి దీవుల్లో చెలరేగిన కార్చిచ్చులో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం వరకే 100 మందికిపైగా మృతి చెందినట్టు అమెరికా అధికారిక వర్గాలు ప్రకటించాయి. కార్చిచ్చుతో వేలాది మంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. సుమారు 2200 పైగా భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కార్చిచ్చు నివారణలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. శవాల కోసం శవ కుక్కలతో రికవరీ సిబ్బంది వందలాది గృహాలల్లో పరిశీలన చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. లహైనాలో వాహనాలను తగలబడటం వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
మౌయి ద్వీపంలోని చారిత్రక తీర పట్టణం బుధవారం తెల్లవారుజామున కార్చిచ్చులో తగులబడి దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. కార్చిచ్చు సమయంలో ద్వీపంలోని సైరన్లు ఏవీ ఎందుకు యాక్టివేట్ చేయలేదని మీడియా ప్రశ్నించగా.. హవాయి సెనేటర్ మజీ హిరోనో రాష్ట్ర అటార్నీ జనరల్ ప్రకటించిన దర్యాప్తు ఫలితాల కోసం వేచి చూస్తాన్నమని చెప్పారు. జరిగిన విషాదానికి నేను ఎటువంటి సాకులు చెప్పబోనని డెమొక్రాట్ అయిన హిరోనో మీడియాకు చెప్పారు. రెస్క్యూ పనులు ఇంకా వేగంగా నిర్వహించడంపై, మృతదేహాలను వెతకడంలో దృష్టి సారించినట్టు తెలిపారు. లాహైనాలో మంటలు చెలరేగడంతో 2,200 కంటే ఎక్కువ భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. అధికారిక అంచనాల ప్రకారం 5.5 బిలియన్ల అమెరికా డాలర్ల నష్టం వాటిల్లిందని.. కార్చిచ్చు మూలంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. శవ కుక్కలతో ఇప్పటికీ వందలాది మంది వ్యక్తుల కోసం వెతకడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పెల్లెటియర్ చెప్పారు. వీలయినంత వేగంగా పరిశోధిస్తున్నట్టు చెప్పారు. నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ప్రకారం, మిన్నెసోటా మరియు విస్కాన్సిన్లలో 453 మంది మరణించిన తర్వాత 1918 నుండి అమెరికాలో ఇప్పుడు సంభవించిన కార్చి్చ్చే అత్యంత ఘోరమైనదని తెలిపారు. 2018లో కాలిఫోర్నియాలోని క్యాంప్ ఫైర్ను అధిగమించిందని.. చిన్న పట్టణమైన ప్యారడైజ్ను తుడిచిపెట్టిందని.. ఆ ప్రమాదంలో 86 మంది మరణించారని తెలిపారు. ద్వీపాలు సునామీలు, భూకంపాలు మరియు హింసాత్మక తుఫానుల వంటి సహజ విపత్తులకు గురైనప్పటికీ, విపత్తు కోసం అధికారులు ఎలా సన్నద్ధమయ్యారు అనే ప్రశ్నలు అడుగుతున్నారు.
తాజావార్తలు
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
-
Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!