Hawaii Wildfires: హవాయి దీవుల కార్చి చ్చులో 100కి చేరిన మృతులు.. 2200 భవనాలు నాశనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hawaii Wildfires: అమెరికాలోని హవాయి దీవుల్లో చెలరేగిన కార్చిచ్చులో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం వరకే 100 మందికిపైగా మృతి చెందినట్టు అమెరికా అధికారిక వర్గాలు ప్రకటించాయి. కార్చిచ్చుతో వేలాది మంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. సుమారు 2200 పైగా భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కార్చిచ్చు నివారణలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. శవాల కోసం శవ కుక్కలతో రికవరీ సిబ్బంది వందలాది గృహాలల్లో పరిశీలన చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. లహైనాలో వాహనాలను తగలబడటం వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read
- Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
మౌయి ద్వీపంలోని చారిత్రక తీర పట్టణం బుధవారం తెల్లవారుజామున కార్చిచ్చులో తగులబడి దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. కార్చిచ్చు సమయంలో ద్వీపంలోని సైరన్లు ఏవీ ఎందుకు యాక్టివేట్ చేయలేదని మీడియా ప్రశ్నించగా.. హవాయి సెనేటర్ మజీ హిరోనో రాష్ట్ర అటార్నీ జనరల్ ప్రకటించిన దర్యాప్తు ఫలితాల కోసం వేచి చూస్తాన్నమని చెప్పారు. జరిగిన విషాదానికి నేను ఎటువంటి సాకులు చెప్పబోనని డెమొక్రాట్ అయిన హిరోనో మీడియాకు చెప్పారు. రెస్క్యూ పనులు ఇంకా వేగంగా నిర్వహించడంపై, మృతదేహాలను వెతకడంలో దృష్టి సారించినట్టు తెలిపారు. లాహైనాలో మంటలు చెలరేగడంతో 2,200 కంటే ఎక్కువ భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. అధికారిక అంచనాల ప్రకారం 5.5 బిలియన్ల అమెరికా డాలర్ల నష్టం వాటిల్లిందని.. కార్చిచ్చు మూలంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. శవ కుక్కలతో ఇప్పటికీ వందలాది మంది వ్యక్తుల కోసం వెతకడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పెల్లెటియర్ చెప్పారు. వీలయినంత వేగంగా పరిశోధిస్తున్నట్టు చెప్పారు. నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ప్రకారం, మిన్నెసోటా మరియు విస్కాన్సిన్లలో 453 మంది మరణించిన తర్వాత 1918 నుండి అమెరికాలో ఇప్పుడు సంభవించిన కార్చి్చ్చే అత్యంత ఘోరమైనదని తెలిపారు. 2018లో కాలిఫోర్నియాలోని క్యాంప్ ఫైర్ను అధిగమించిందని.. చిన్న పట్టణమైన ప్యారడైజ్ను తుడిచిపెట్టిందని.. ఆ ప్రమాదంలో 86 మంది మరణించారని తెలిపారు. ద్వీపాలు సునామీలు, భూకంపాలు మరియు హింసాత్మక తుఫానుల వంటి సహజ విపత్తులకు గురైనప్పటికీ, విపత్తు కోసం అధికారులు ఎలా సన్నద్ధమయ్యారు అనే ప్రశ్నలు అడుగుతున్నారు.
తాజావార్తలు
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!