Postmortem: పోస్టుమార్టానికి తరలిస్తుండగా దేహంలో కదలికలు.. ఉలిక్కిపడ్డ అధికారులు
Dead Policeman Comes alive While Taking To Postmortem in Punjab Ludhiana: పంజాబ్లోని లూథియానాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయాడుకున్న పోలీసు అధికారం పోస్టమార్టం కోసం తరలిస్తుండగా ఉన్నట్టుండి కదిలాడు. దీంతో వెంటనే అతడిని మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యుల వేరే ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం పంజాబ్ లోని లుధియానాకు చెందిన పోలీసు అధికారి మన్ ప్రీత్ ను విషపు పురుగులు కుట్టాయి. దీంతో శరీరంలో ఇన్ఫెక్షన్ పెరగడంతో వారి కుటుంబ సభ్యులు మన్ ప్రీత్ ను ఎయిమ్స్ బస్సీ ఆసుపత్రిలో చేర్పించారు.
Also Read: Ola Electric IPO: ఐపీవోకు ఓలా ఎలక్ట్రిక్ సన్నాహాలు.. అక్టోబర్లో డ్రాఫ్ట్ పేపర్ దాఖలు చేయనున్న కంపెనీ
Also Read
- IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
ఆసుపత్రిలో చేర్పించగానే అక్కడి వైద్యులు మన్ ప్రీత్ చేతిపై ఏదో మందు రాశారు. దాంతో అతని చేయి బాగా మండిపోయింది. దీంతో మన్ ప్రీత్ రాత్రంతా మూలుగుతూనే ఉన్నాడని అతని తండ్రి ఏఎస్ఐ రామ్ జీ తెలిపారు. తరువాత ఆసుపత్రి సిబ్బంది తమ కొడుకు పరిస్థితి క్లిష్టంగా ఉందని చెప్పారని వెంటిలేటర్ పై ఉంచాలని సూచించారని వెల్లడించారు. తమకు తెలిసినంత వరకు తమ కొడుకును రెండు నుంచి మూడు రోజులు వెంటిలేటర్ పై ఉంచినట్లు పేర్కొన్నారు. అయితే వెంటిలేటర్ పై నుంచి తీస్తే తమ కొడుకు మరణిస్తాడని చెప్పారని, తరువాత వచ్చి తమ కొడుకు చనిపోయాడు తెల్లారి తొమ్మిది గంటల సమయంలో బాడీని అప్పగిస్తామని చెప్పినట్లు తెలిపారు. అయితే మన్ ప్రీత్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతడిని పోస్ట్ మార్టం కోసం కొంతమంది వేరే పోలీసుల సాయంతో తరలిస్తుండగా అతడిలో కదలికలు ఉండటాన్ని ఓ పోలీసు గుర్తించి చెప్పాడని వెంటనే అతడిని మరో ఆసుపత్రికి తరలిచ్చామని అక్కడ మన్ ప్రీత్ పరిస్థితి నిలకడగా ఉందని రామ్ జీ తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తన కొడుకు ప్రాణాలు పోయేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రామ్ జీ వ్యాఖ్యలను ఆసుపత్రి వర్గాలు ఖండించాయి. మన్ ప్రీత్ చనిపోయినట్లు తాము అసలు నిర్థారించలేదని, అలా అని తాము ఏ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదని పేర్కొ్న్నారు. తాము కానీ, ఆసుపత్రి సిబ్బంది ఎవరూ కానీ అలా చెప్పలేదని వైద్యులు చెబుతున్నారు. కేవలం మన్ ప్రీత్ పరిస్థితి విషయంగా ఉందని మాత్రమే తాము చెప్పామని అందుకే వేరే ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్ కూడా ఇచ్చి పంపించామని ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టిపారేస్తున్నారు.
తాజావార్తలు
-
IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
-
Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
-
Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్?
-
The India Story: జూలై 24న కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరి’
-
AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!