Postmortem: పోస్టుమార్టానికి తరలిస్తుండగా దేహంలో కదలికలు.. ఉలిక్కిపడ్డ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dead Policeman Comes alive While Taking To Postmortem in Punjab Ludhiana: పంజాబ్లోని లూథియానాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయాడుకున్న పోలీసు అధికారం పోస్టమార్టం కోసం తరలిస్తుండగా ఉన్నట్టుండి కదిలాడు. దీంతో వెంటనే అతడిని మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యుల వేరే ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం పంజాబ్ లోని లుధియానాకు చెందిన పోలీసు అధికారి మన్ ప్రీత్ ను విషపు పురుగులు కుట్టాయి. దీంతో శరీరంలో ఇన్ఫెక్షన్ పెరగడంతో వారి కుటుంబ సభ్యులు మన్ ప్రీత్ ను ఎయిమ్స్ బస్సీ ఆసుపత్రిలో చేర్పించారు.
Also Read: Ola Electric IPO: ఐపీవోకు ఓలా ఎలక్ట్రిక్ సన్నాహాలు.. అక్టోబర్లో డ్రాఫ్ట్ పేపర్ దాఖలు చేయనున్న కంపెనీ
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ఆసుపత్రిలో చేర్పించగానే అక్కడి వైద్యులు మన్ ప్రీత్ చేతిపై ఏదో మందు రాశారు. దాంతో అతని చేయి బాగా మండిపోయింది. దీంతో మన్ ప్రీత్ రాత్రంతా మూలుగుతూనే ఉన్నాడని అతని తండ్రి ఏఎస్ఐ రామ్ జీ తెలిపారు. తరువాత ఆసుపత్రి సిబ్బంది తమ కొడుకు పరిస్థితి క్లిష్టంగా ఉందని చెప్పారని వెంటిలేటర్ పై ఉంచాలని సూచించారని వెల్లడించారు. తమకు తెలిసినంత వరకు తమ కొడుకును రెండు నుంచి మూడు రోజులు వెంటిలేటర్ పై ఉంచినట్లు పేర్కొన్నారు. అయితే వెంటిలేటర్ పై నుంచి తీస్తే తమ కొడుకు మరణిస్తాడని చెప్పారని, తరువాత వచ్చి తమ కొడుకు చనిపోయాడు తెల్లారి తొమ్మిది గంటల సమయంలో బాడీని అప్పగిస్తామని చెప్పినట్లు తెలిపారు. అయితే మన్ ప్రీత్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతడిని పోస్ట్ మార్టం కోసం కొంతమంది వేరే పోలీసుల సాయంతో తరలిస్తుండగా అతడిలో కదలికలు ఉండటాన్ని ఓ పోలీసు గుర్తించి చెప్పాడని వెంటనే అతడిని మరో ఆసుపత్రికి తరలిచ్చామని అక్కడ మన్ ప్రీత్ పరిస్థితి నిలకడగా ఉందని రామ్ జీ తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తన కొడుకు ప్రాణాలు పోయేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రామ్ జీ వ్యాఖ్యలను ఆసుపత్రి వర్గాలు ఖండించాయి. మన్ ప్రీత్ చనిపోయినట్లు తాము అసలు నిర్థారించలేదని, అలా అని తాము ఏ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదని పేర్కొ్న్నారు. తాము కానీ, ఆసుపత్రి సిబ్బంది ఎవరూ కానీ అలా చెప్పలేదని వైద్యులు చెబుతున్నారు. కేవలం మన్ ప్రీత్ పరిస్థితి విషయంగా ఉందని మాత్రమే తాము చెప్పామని అందుకే వేరే ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్ కూడా ఇచ్చి పంపించామని ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టిపారేస్తున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!