Daggubati Purandeswari: రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఎంపీ పర్యటన..
- నేడు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి - ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి - రైల్వే డి.ఆర్.ఎం నరేందర్ ఏ పాటిల్ పర్యటించారు.
- గోదావరి పుష్కరాలకు 2027 జనవరి నాటికే రాజమండ్రి రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయమని అధికారాలను కోరినట్లు .
- రాజమండ్రి రైల్వే స్టేషన్ ను తూర్పు వైపున కూడా అభివృద్ధి చేయమని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari: నేడు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రైల్వే డి.ఆర్.ఎం నరేందర్ ఏ పాటిల్ పర్యటించారు. 250 కోట్ల రూపాయలతో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేపట్టనున్న నేపథ్యంలో పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… రాజమండ్రి రైల్వే స్టేషన్ ను వరల్డ్ క్లాస్ స్టేషన్ గా తీర్చిదిద్దుతాం అని., గోదావరి పుష్కరాలకు 2027 జనవరి నాటికే రాజమండ్రి రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయమని అధికారాలను కోరినట్లు తెలిపారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ ను తూర్పు వైపున కూడా అభివృద్ధి చేయమని అడిగామని., సనుకుల వాతావరణంలో ఇవాళ రైల్వే అధికారులతో సమావేశం జరిగిందని., రాజమండ్రి రైల్వే స్టేషన్ సమస్యలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇంకా కొవ్వూరు, అనపర్తి స్టేషన్లో మరికొన్ని రైళ్లు ఆపాలని కోరినట్లు ఆమె తెలిపింది.
Wayanad Landslides : ధైర్యానికి పేరు.. అన్నిటినీ దాటుకుని అమాయక గిరిజనులను కాపాడిన సైనికులు
Also Read
అలాగే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ… రాజమండ్రి తూర్పు రైల్వే స్టేషన్ రోడ్ ను విస్తరణ చేయాలని నిర్ణయించామని., రాజమండ్రి అన్నపూర్ణమ్మ పేట అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తున్నామని., హేవలాక్ వంతెన పర్యాటక రంగంగా అబివృద్ది చేస్తామని ఆయన అన్నారు. అలాగే అనపర్తి స్టేషన్ లో ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు విశాఖ వెళ్ళటానికి రైళ్ళు అందుబాటులో ఉండవు.. కాబట్టి అనపర్తిలో స్టేషన్లో జన్మభూమి హాల్ట్ , ఫుట్ ఓవర్ బ్రిడ్జి అడిగామని., బిక్కవోలు రైల్వే స్టేషన్ అబివృద్ది చేయాలని., కేశవరం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై డిఆర్ఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.
Sandra Venkata Veeraiah: కాంగ్రెస్ పాలనపై హట్ కామెంట్స్ చేసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర..
ఇక ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే సూచన మేరకు రైల్వే స్టేషన్ తూర్పు వైపు కూడా అభివృద్ధి చేస్తాం.. రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెన పై భారీ వాహనాలు నిషేధించమని జిల్లా అధికారులకు స్పష్టంగా చెప్పామని రైల్వే డి.ఆర్.ఎం నరేందర్ ఏ పాటిల్ తెలిపారు.
తాజావార్తలు
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
-
Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!