Cyclone Biparjoy: బిపార్జోయ్ విధ్వంసం.. అంధకారంలో 950 గ్రామాలు.. నేలకూలిన 500కు పైగా చెట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Biparjoy: బిపార్జోయ్ తుఫాను గుజరాత్ రాష్ట్రంలో భీకర రూపం దాల్చుతోంది. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. అదే స్థాయిలో బలమైన గాలులు వీస్తున్నాయి. తుఫాను గురించి చెప్పిన దానికంటే ఇది చాలా ప్రమాదకరమైనదిగా కనిపిస్తోంది. ఈదురు గాలులకు విద్యుత్ తీగలు, స్తంభాలు నేలకొరిగాయి. మోర్బి జిల్లాలోని మాలియా తహసీల్లోని 45 గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. 9 గ్రామాల్లో విద్యుత్ను పునరుద్ధరిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారి తెలిపారు. గత రాత్రి గుజరాత్ తీరాన్ని బిపార్జోయ్ తాకింది. దాని తక్కువ వేగం కారణంగా ఇది ముందుకు సాగడానికి సమయం పడుతుంది. బిపార్జోయ్ తుఫాను కేంద్రం సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో 30 కి.మీ ఉత్తరాన కేంద్రీకృతమై ఉంది.
Read Also:Adipurush : ఆదిపురుష్లో తండ్రి కొడుకులుగా ప్రభాస్.. సినిమాలోని హైలెట్స్ ఇవే ..
Also Read
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
- Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
బిపార్జోయ్ మధ్యాహ్నానికి రాజస్థాన్ను తాకవచ్చు. దీని తర్వాత రాజస్థాన్, హర్యానా, యూపీలో వాతావరణం మారవచ్చు. బలమైన గాలులు వీచవచ్చు. తుపాను కారణంగా 22 మంది గాయపడ్డారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 23 జంతువులు చనిపోగా, 524 చెట్లు నేలకూలినట్లు సమాచారం. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. సహాయక బృందాలు ఆ ప్రాంతమంతా విస్తరించి ఉన్నాయి. ఎక్కడ నష్టం జరిగినా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే బృందాలు అక్కడికి వెళ్లి సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.
ఎప్పటికప్పుడు ప్రధాని సమీక్ష
ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం టచ్లో ఉన్నారు. సీఎం భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గిర్ ఫారెస్ట్లో సింహాలు సహా వన్యప్రాణుల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో వెలుతురు దెబ్బతింది. మాండ్వి నగరంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. జఖౌ-మాండ్వి రహదారితో పాటు మాండ్వి నగరంలో అనేక చెట్లు నేలకూలాయి. తుఫాన్ ఇప్పటికీ శక్తివంతంగానే ఉంది.
Read Also:DOST Seat allotment: నేడు దోస్త్ సీట్ల కేటాయింపు.. మొదటి విడతలో 78 వేల మందికి
తుఫాను వ్యాసం 50 కి.మీ
తుపాను వ్యాసం 50 కిలోమీటర్లు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది సౌరాష్ట్ర, కచ్ నుండి ముందుకు కదులుతోంది. బిపార్జోయ్ కారణంగా రైలు సేవలకు ఆటంకం ఏర్పడింది. రైళ్ల రాకపోకల్లో సమస్య తలెత్తింది. 23 రైళ్లను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే తెలిపింది. మూడు రైళ్లను షార్ట్ టర్మినేట్ చేశారు. దీంతో పాటు 99 రైళ్లను రద్దు చేశారు.
తాజావార్తలు
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
-
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
ట్రెండింగ్
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!