Cyclone Biparjoy: బిపార్జోయ్ విధ్వంసం.. అంధకారంలో 950 గ్రామాలు.. నేలకూలిన 500కు పైగా చెట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Biparjoy: బిపార్జోయ్ తుఫాను గుజరాత్ రాష్ట్రంలో భీకర రూపం దాల్చుతోంది. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. అదే స్థాయిలో బలమైన గాలులు వీస్తున్నాయి. తుఫాను గురించి చెప్పిన దానికంటే ఇది చాలా ప్రమాదకరమైనదిగా కనిపిస్తోంది. ఈదురు గాలులకు విద్యుత్ తీగలు, స్తంభాలు నేలకొరిగాయి. మోర్బి జిల్లాలోని మాలియా తహసీల్లోని 45 గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. 9 గ్రామాల్లో విద్యుత్ను పునరుద్ధరిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారి తెలిపారు. గత రాత్రి గుజరాత్ తీరాన్ని బిపార్జోయ్ తాకింది. దాని తక్కువ వేగం కారణంగా ఇది ముందుకు సాగడానికి సమయం పడుతుంది. బిపార్జోయ్ తుఫాను కేంద్రం సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో 30 కి.మీ ఉత్తరాన కేంద్రీకృతమై ఉంది.
Read Also:Adipurush : ఆదిపురుష్లో తండ్రి కొడుకులుగా ప్రభాస్.. సినిమాలోని హైలెట్స్ ఇవే ..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
బిపార్జోయ్ మధ్యాహ్నానికి రాజస్థాన్ను తాకవచ్చు. దీని తర్వాత రాజస్థాన్, హర్యానా, యూపీలో వాతావరణం మారవచ్చు. బలమైన గాలులు వీచవచ్చు. తుపాను కారణంగా 22 మంది గాయపడ్డారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 23 జంతువులు చనిపోగా, 524 చెట్లు నేలకూలినట్లు సమాచారం. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. సహాయక బృందాలు ఆ ప్రాంతమంతా విస్తరించి ఉన్నాయి. ఎక్కడ నష్టం జరిగినా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే బృందాలు అక్కడికి వెళ్లి సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.
ఎప్పటికప్పుడు ప్రధాని సమీక్ష
ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం టచ్లో ఉన్నారు. సీఎం భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గిర్ ఫారెస్ట్లో సింహాలు సహా వన్యప్రాణుల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో వెలుతురు దెబ్బతింది. మాండ్వి నగరంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. జఖౌ-మాండ్వి రహదారితో పాటు మాండ్వి నగరంలో అనేక చెట్లు నేలకూలాయి. తుఫాన్ ఇప్పటికీ శక్తివంతంగానే ఉంది.
Read Also:DOST Seat allotment: నేడు దోస్త్ సీట్ల కేటాయింపు.. మొదటి విడతలో 78 వేల మందికి
తుఫాను వ్యాసం 50 కి.మీ
తుపాను వ్యాసం 50 కిలోమీటర్లు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది సౌరాష్ట్ర, కచ్ నుండి ముందుకు కదులుతోంది. బిపార్జోయ్ కారణంగా రైలు సేవలకు ఆటంకం ఏర్పడింది. రైళ్ల రాకపోకల్లో సమస్య తలెత్తింది. 23 రైళ్లను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే తెలిపింది. మూడు రైళ్లను షార్ట్ టర్మినేట్ చేశారు. దీంతో పాటు 99 రైళ్లను రద్దు చేశారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!