PM Modi Tour: రోడ్షోలో ప్రధాని మోడీకి సైకిలిస్టులు స్వాగతం.. మోడీ మోడీ నినాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా రూ.24,300 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ప్రధాని మోదీ రోడ్షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో ప్రధానికి వినూత్నంగా సైకిలిస్టులు స్వాగతం పలికారు. ఆ సమయంలో ప్రధానమంత్రి కారుతో పాటు సైకిల్ తొక్కుతూ కనిపించారు. ప్రధానమంత్రి రోడ్షో సందర్భంగా ఆయనను చూసేందుకు ప్రజలు రోడ్డు పక్కనే నిల్చున్నారు. ఆ సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ.. అక్కడి జనాలు మోడీ-మోదీ అంటూ నినాదాలు చేశారు.
Sachin Pilot: సచిన్ పైలట్ కీలక ప్రకటన.. ఎన్నికల్లో ఐక్యంగా పోరాడేందుకు సిద్ధం
Also Read
మరోవైపు అమృత్సర్-జామ్నగర్ ఎకనామిక్ కారిడార్లోని 6-లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే సెక్షన్ను ప్రధాని ప్రారంభించారు. రాజస్థాన్లోని ఈ కారిడార్ పొడవు 500 కి.మీ కంటే ఎక్కువ. అంతేకాకుండా బికనీర్-భివాడి ట్రాన్స్మిషన్ లైన్ మరియు కొత్త 30 పడకల ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) హాస్పిటల్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతే కాకుండా.. బికనీర్ రైల్వే స్టేషన్ను తిరిగి అభివృద్ధి చేయడానికి మరియు 43 కి.మీ పొడవైన చురు-రతన్గఢ్ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
Kushi: మ్యూజిక్ లవర్స్కి ‘మెలోడియస్’ అప్డేట్.. రెండో పాట రిలీజ్ ఎప్పుడంటే?
రాజస్థాన్ ప్రజలు కొన్ని నెలల్లోనే రెండు ఆధునిక ఆరు లేన్ ఎక్స్ప్రెస్లను పొందుతారని ప్రధాని మోదీ చెప్పారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేలోని ఢిల్లీ-దౌసా-లాల్సోట్ సెక్షన్ ఫిబ్రవరిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అభివృద్ధి రంగంలో ఉన్న అధిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతుందని ప్రధాని తెలిపారు. అంతేకాకుండా రాజస్థాన్ లో అపారమైన అవకాశాలకు కేంద్రంగా ఉందని ఆయన చెప్పారు.
- Tags
- Cyclists
- modi
- national news
- tour
- welcome
తాజావార్తలు
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!