Renu Agarwal Murder: రేణు అగర్వాల్ మర్డర్ కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ
- రేణు అగర్వాల్ మర్డర్ కేసు
- సంచలన విషయాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూకట్ పల్లిలో అత్యంత దారుణంగా అత్యంత దారుణంగా హత్యకు గురైంది రేణు అగర్వాల్ అనే మహిళ. ఇంట్లో పనికి చేరిన వాళ్లే డబ్బు, నగలు కాజేసేందుకు మహిళ ప్రాణాలు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సంచలన విషయాలు వెల్లడించారు. సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ.. కూకట్ పల్లి పీఎస్ లిమిట్స్ లో పదో తేదీన రేణు అగర్వాల్ మర్డర్ జరిగింది.. రేణు అగర్వాల్ అనే మహిళను స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో రోషన్ & హర్ష అనే నిందితులు హత్య చేశారు.. హర్ష కొద్ది రోజుల క్రితమే రేణు అగర్వాల్ ఇంట్లో పనికి కుదిరాడు..
Also Read:Anakapalli: అనకాపల్లిలో కూతురితో ప్రేమ.. అరుణాచలంలో యువకుడు దారుణ హత్య..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
రోషన్ అదే అపార్ట్మెంట్ లో పై అంతస్తులో పని చేస్తాడు.. ఇద్దరు రాంచీ కి చెందిన వారు.. 2023 లో రోషన్ పై మూడు కేసులు నమోదు అయ్యాయి.. రేణు అగర్వాల్ ఇంట్లో డబ్బులు బంగారం ఉన్నాయి అని నిందితులు తెలుసుకున్నారు.. రేణు కుమారుడు, భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్లగానే పదో తేదీన కుక్కర్ తో ఆమె తలపై మోదారు.. ఆ తర్వాత ఆమె కాళ్లు చేతులు కట్టేసి ఇంట్లో ఆభరణాలు తీసుకుని వెళ్ళిపోయారు.. 7 తులాల బంగారు ఆభరణాలు.. పది వాచ్ లు, రోల్డ్ గోల్డ్ వాచ్ లు దొంగతనం చేశారు.. 8 వ తేదీ నుండి దోపిడీకి ప్లాన్ చేసుకున్నారు.. ఆ తర్వాత మహిళను హత్య చేసి దోచుకుని పరారయ్యారు.
వెంటనే టీం లను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టాం.. ఇద్దరు నిందితులు పరిచయస్తులు.. నిన్న ఇద్దరు రాంచీ వద్ద పట్టుబడ్డారు..హర్ష మత్తు పదార్థాలు సేవిస్తాడు.. గతంలో కోల్కతా రీహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స తీసుకున్నాడు.. ఈ కేసులో రోషన్ సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నాం.. దోచుకున్న ఆభరణాలు దాచడానికి అతను సహాయ పడ్డారు.. నిందితులు ఇద్దరు మర్డర్ అనంతరం హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు.. అక్కడ క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా రాంచీ చేరుకున్నారు..
Also Read:RBI: ఫోన్ పేకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా.. ఎందుకంటే.
టివిలో వస్తున్న వార్తలు చూసి క్యాబ్ డ్రైవర్ ఇన్పుట్ ఇచ్చాడు.. ఆ ఇన్పుట్ కన్ఫర్మేషన్ అనంతరం రాంచీ వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకున్నాము.. నిందితులు హఫీజ్ పేట్ నుండి సికింద్రాబాద్ కు MMTS టికెట్లు తీసుకున్నారు.. స్టేషన్ లో పోలీసులను చూసి హఫీజ్ పేట్ నుండి బయటకు క్యాబ్ బుక్ చేసుకుని రాంచీ వెళ్లారు.. రాత్రి ఒంటి గంటకు హఫీజ్ పేట్ నుండి క్యాబ్ లో బయలుదేరి ఉదయం తొమ్మిది గంటలకు దిగారని తెలిపారు. జార్ఖండ్ లో నిందితులను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించామని వెల్లడించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..