Cyber Cheating: బాసర పేరుతో భారీ దందాకు తెరతీసిన సైబర్ కేటుగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Cheating: చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లా బాసరలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ వైదిక పండితులు గోమాతకు పూజలు చేసి హోమం నిర్వహించి వేడుకలు ప్రారంభించారు. గురువారం వరకు బాసరలో వసంత పంచమి వేడుకలు జరగనున్నాయి. హోటల్ రూం బుకింగుల పేరిట బాసర భక్తులను దృష్టిలో ఉంచుకుని సైబర్ కేటుగాళ్లు చీటింగ్ కు తెరతీశారు. హరిత హోటల్ ఆన్ లైన్ రూమ్ ల బుకింగ్ పేరుతో కొత్త యాప్ సృష్టించారు. క్యూ ఆర్ కోడ్ పంపి డబ్బులు దండుకుంటున్నారు. వారి వలలో పడి పదుల సంఖ్యలో భక్తులు మోస పోతున్నారు. కొంతమంది మోసపోయిన సంగతి గ్రహించి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. హరిత హోటల్ బాసర పేరుతో ఓ ఫొటో దాని పైన నంబర్ రోల్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు… రూమ్ బుక్ కావాలంటే డబ్బులు పంపించాలని అడుగుతున్నారు చీటర్స్. అది తెలియక డబ్బులు పంపి మోస పోతున్నారు భక్తులు.
Read Also: Kishan Reddy : కూర్చుని చర్చిద్దాం రండి.. ఎవరేం చేశారో..
Also Read
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లా బాసరలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ వైదిక పండితులు గోమాతకు పూజలు చేసి హోమం నిర్వహించి వేడుకలు ప్రారంభించారు. గురువారం వరకు బాసరలో వసంత పంచమి వేడుకలు జరగనున్నాయి. తెల్లవారు జాము ఒకటిన్నర గంటలకు మంగళవాయిద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి చండీవాహనం, వేదపారాయణంతో పాటు మహా పూజలు నిర్వహిస్తున్నారు. కాగా జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాలకు అర్ధరాత్రే బాసరకు చేరుకున్న భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక అమ్మవారి చెంత అక్షరాభ్యాసం చేయిస్తే విద్యాబుద్ధులు దండిగా ఉంటాయని భక్తుల అపారనమ్మకం. అమ్మవారి దర్శనానికి మూడు క్యూలైన్లను అధికారులు సిద్ధం చేశారు. కాగా ఏటా మాఘ శుద్ధ పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటారు. ఆ రోజు చదువుల తల్లి సరస్వతి దేవిని ప్రతిఒక్కరు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కాగా దేవాదాయశాఖ తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉదయం 8 గంటలకుకాగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
Read Also: Crime News: భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!