Crime News: భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భార్య కట్టుకున్న భర్తను రోకలిబండతో కొట్టి చంపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలతో భర్త తుమ్మల వెంకట్ రెడ్డిని రోకలిబండ తో తల పై బాది భార్య రుక్మవ్వ హత్య చేసింది. తుమ్మల వెంకట్ రెడ్డి, రుక్మవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా ఒక కుమారుడు మరణించాడు. రెండవ కుమారుడు వేరే గ్రామంలో ఉంటున్నాడు. కాగా గత కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరుగగా విసిగి పోయిన భార్య ఇంట్లో ఉన్న రోకలి బండతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అక్క బండ రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలు రుక్మవ్వని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Read Also: BJP v/s MRPS: మహబూబ్ నగర్లో ఉద్రిక్తత.. బీజేపీ ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఇది ఇలా ఉంటే.. అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని పాళ్లూరులో అన్నదమ్ముల మధ్య భూ వివాదం హత్యకు దారితీసింది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు…పాళ్లూరుకి చెందిన రేషం బొమ్మయ్య, గొల్ల చిక్కీరప్ప, ఈరన్న, భీమప్ప, బొమ్మయ్య అన్నదమ్ములు. వీరికి పాళ్లూరులో 18 ఎకరాలు, కర్ణాటక రాష్ట్రంలోని కెంచగానిపల్లిలో 24 ఎకరాల భూములు ఉన్నాయి. రెండు నెలలుగా అన్నదమ్ముల మధ్య భూముల పంపకం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. గ్రామ పెద్దలు పంచాయితీ చేసినా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో తన వాటా భూమి తనకు ఇవ్వాలని గొల్ల చిక్కీరప్ప పాళ్లూరు భూమి వద్దకు సోమవారం వెళ్లాడు. అప్పటికే అక్కడ ఆయన తమ్ముడు గొల్ల బొమ్మయ్య, తమ్ముడి భార్య చిత్తక్క పనులు చేస్తున్నారు. ఇక నుంచి పొలం పనులు చేయొద్దని, తన భూమిని తనకు ఇచ్చేయాలని వారితో చిక్కీరప్ప గొడవ పెట్టుకున్నారు. దీంతో చిక్కీరప్పతో తమ్ముడు, తమ్ముడి భార్య గొడవ పడ్డారు. ఇద్దరూ కలిసి ఆయనను కిందకు తోసేసి కాళ్లతో తొక్కారు. దీంతో చిక్కీరప్ప ప్రాణాలు కోల్పోయాడు.
Read Also: New Secretariat : కొత్త సెక్రటేరియట్ను పరిశీలించిన సీఎం కేసీఆర్
తాజావార్తలు
-
Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!