Crime News: భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భార్య కట్టుకున్న భర్తను రోకలిబండతో కొట్టి చంపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలతో భర్త తుమ్మల వెంకట్ రెడ్డిని రోకలిబండ తో తల పై బాది భార్య రుక్మవ్వ హత్య చేసింది. తుమ్మల వెంకట్ రెడ్డి, రుక్మవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా ఒక కుమారుడు మరణించాడు. రెండవ కుమారుడు వేరే గ్రామంలో ఉంటున్నాడు. కాగా గత కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరుగగా విసిగి పోయిన భార్య ఇంట్లో ఉన్న రోకలి బండతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అక్క బండ రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలు రుక్మవ్వని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Read Also: BJP v/s MRPS: మహబూబ్ నగర్లో ఉద్రిక్తత.. బీజేపీ ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
Also Read
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
- SS Rajamouli: "ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది".. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
- 55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
ఇది ఇలా ఉంటే.. అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని పాళ్లూరులో అన్నదమ్ముల మధ్య భూ వివాదం హత్యకు దారితీసింది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు…పాళ్లూరుకి చెందిన రేషం బొమ్మయ్య, గొల్ల చిక్కీరప్ప, ఈరన్న, భీమప్ప, బొమ్మయ్య అన్నదమ్ములు. వీరికి పాళ్లూరులో 18 ఎకరాలు, కర్ణాటక రాష్ట్రంలోని కెంచగానిపల్లిలో 24 ఎకరాల భూములు ఉన్నాయి. రెండు నెలలుగా అన్నదమ్ముల మధ్య భూముల పంపకం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. గ్రామ పెద్దలు పంచాయితీ చేసినా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో తన వాటా భూమి తనకు ఇవ్వాలని గొల్ల చిక్కీరప్ప పాళ్లూరు భూమి వద్దకు సోమవారం వెళ్లాడు. అప్పటికే అక్కడ ఆయన తమ్ముడు గొల్ల బొమ్మయ్య, తమ్ముడి భార్య చిత్తక్క పనులు చేస్తున్నారు. ఇక నుంచి పొలం పనులు చేయొద్దని, తన భూమిని తనకు ఇచ్చేయాలని వారితో చిక్కీరప్ప గొడవ పెట్టుకున్నారు. దీంతో చిక్కీరప్పతో తమ్ముడు, తమ్ముడి భార్య గొడవ పడ్డారు. ఇద్దరూ కలిసి ఆయనను కిందకు తోసేసి కాళ్లతో తొక్కారు. దీంతో చిక్కీరప్ప ప్రాణాలు కోల్పోయాడు.
Read Also: New Secretariat : కొత్త సెక్రటేరియట్ను పరిశీలించిన సీఎం కేసీఆర్
తాజావార్తలు
-
India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!