Crime News: భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భార్య కట్టుకున్న భర్తను రోకలిబండతో కొట్టి చంపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలతో భర్త తుమ్మల వెంకట్ రెడ్డిని రోకలిబండ తో తల పై బాది భార్య రుక్మవ్వ హత్య చేసింది. తుమ్మల వెంకట్ రెడ్డి, రుక్మవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా ఒక కుమారుడు మరణించాడు. రెండవ కుమారుడు వేరే గ్రామంలో ఉంటున్నాడు. కాగా గత కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరుగగా విసిగి పోయిన భార్య ఇంట్లో ఉన్న రోకలి బండతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అక్క బండ రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలు రుక్మవ్వని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Read Also: BJP v/s MRPS: మహబూబ్ నగర్లో ఉద్రిక్తత.. బీజేపీ ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఇది ఇలా ఉంటే.. అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని పాళ్లూరులో అన్నదమ్ముల మధ్య భూ వివాదం హత్యకు దారితీసింది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు…పాళ్లూరుకి చెందిన రేషం బొమ్మయ్య, గొల్ల చిక్కీరప్ప, ఈరన్న, భీమప్ప, బొమ్మయ్య అన్నదమ్ములు. వీరికి పాళ్లూరులో 18 ఎకరాలు, కర్ణాటక రాష్ట్రంలోని కెంచగానిపల్లిలో 24 ఎకరాల భూములు ఉన్నాయి. రెండు నెలలుగా అన్నదమ్ముల మధ్య భూముల పంపకం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. గ్రామ పెద్దలు పంచాయితీ చేసినా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో తన వాటా భూమి తనకు ఇవ్వాలని గొల్ల చిక్కీరప్ప పాళ్లూరు భూమి వద్దకు సోమవారం వెళ్లాడు. అప్పటికే అక్కడ ఆయన తమ్ముడు గొల్ల బొమ్మయ్య, తమ్ముడి భార్య చిత్తక్క పనులు చేస్తున్నారు. ఇక నుంచి పొలం పనులు చేయొద్దని, తన భూమిని తనకు ఇచ్చేయాలని వారితో చిక్కీరప్ప గొడవ పెట్టుకున్నారు. దీంతో చిక్కీరప్పతో తమ్ముడు, తమ్ముడి భార్య గొడవ పడ్డారు. ఇద్దరూ కలిసి ఆయనను కిందకు తోసేసి కాళ్లతో తొక్కారు. దీంతో చిక్కీరప్ప ప్రాణాలు కోల్పోయాడు.
Read Also: New Secretariat : కొత్త సెక్రటేరియట్ను పరిశీలించిన సీఎం కేసీఆర్
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..