Cyber Crime: స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయంటూ.. హైదరాబాద్ లో నాలుగు కోట్ల ఘరానా మోసం..
- వారం రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల నుంచి రూ. 3.81 కోట్లను దోచేసిన సైబర్ నేరస్థులు.
- సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: హర్షద్ మెహతా లాగా వేలకోట్ల రూపాయలు సంపాదించాలనుకుంటున్నారా..? ముకేష్ అంబానీ లాగా కోటీశ్వరుడు కావాలనుకుంటున్నారా..? స్టాక్ మార్కెట్లో మీరు ఒక వెలుగు వెలగాలనుకుంటున్నారా..? అయితే మేము అందిస్తున్న టిప్స్ లో పెట్టుబడి పెట్టండి.. అధిక లాభాలు ఇస్తాం.. అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇబ్బందిగా వస్తున్నాయి ..ఈ మెసేజ్ లను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మనం పూర్తిగా నిండా మోనిగిపోయినట్టే.. సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటన చూసి గ్రూపులో యాడ్ అయిన ఇద్దరి వ్యక్తుల నుంచి దాదాపు నాలుగు కోట్ల రూపాయలను వసూలు చేసిన సైబర్ కేటుగాళ్లు.. దశలవారీగా డబ్బులను తమ అకౌంట్లో వేయించుకొని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నామని అధిక లాభాలు వచ్చాయని సాఫ్ట్వేర్ లో చూపెడుతూ మోసం చేసిన తీరు పటాన్ చెరు ఇద్దరు యువకుల దగ్గర నుంచి దాదాపు నాలుగు కోట్ల రూపాయలని వారం రోజులు పరిధిలోని సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు.
Market Value : ప్రపంచంలోని బిలియనీర్ల పాలిట ‘బ్లాక్ ఫ్రైడే’.. రూ. 56 లక్షల కోట్ల నష్టం
Also Read
వారం రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల నుంచి రూ.3.81 కోట్లను సైబర్ నేరస్థులు దోచుకున్నారంటూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఏపీఆర్ లగ్జూరియాకి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫేస్బుక్లో 45 రోజుల క్రితం స్టాక్ మార్కెట్ పేరిట ఉన్న ఓ ప్రకటన చూసి క్లిక్ చేశాడు. దీంతో అతడు సైబర్ నేరస్థులు క్రియేట్ చేసిన ఒక వాట్సాప్ గ్రూప్లో సభ్యుడిగా మారాడు. అనంతరం పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని వారు సూచించడంతో పెట్టుబడి పెట్టాడు. వారు ఒక పోర్టల్ క్రియేట్ చేసి వచ్చిన లాభాలు అంటూ అందులోనూ చూపించారు. ఇలా 22 దఫాలుగా రూ.2.4 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. తనకు వచ్చిన లాభాలు, పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలంటూ కోరడంతో సైబర్ నేరస్థులు స్పందించలేదు. చివరికి మోసపోయానని గ్రహించి తొలుత సైబర్ క్రైమ్ పోలీసులకు, అనంతరం పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Wayanad Landslides : ధైర్యానికి పేరు.. అన్నిటినీ దాటుకుని అమాయక గిరిజనులను కాపాడిన సైనికులు
మరొక కేసులో యూట్యూబ్లో స్టాక్ మార్కెట్ ప్రకటన చూసి క్లిక్ చేయడంతో మరో వ్యక్తి కూడా వాట్సాప్ గ్రూపులో సభ్యుడిగా మారాడు. నెల రోజులుగా రూ.66.75 లక్షల పెట్టుబడి పెట్టాడు. తనకు వచ్చిన లాభాలు, పెట్టుబడి తిరిగి ఇవ్వాలని కోరితే వారు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించి అతడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
-
No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!