Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Curfew In Odisha Balasore On Bakra Eid Over Cow Slaughter Allegation

Odisha : ఒడిశాలో బక్రీద్ రోజు చెలరేగిన హింస.. 144సెక్షన్ విధింపు

Published Date :June 18, 2024 , 11:52 am
By Rakesh Reddy
  • ఒడిశాలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణ
  • 144సెక్షన్ విధింపు
  • ఇంటర్నెట్ బంద్
Odisha : ఒడిశాలో బక్రీద్ రోజు చెలరేగిన హింస.. 144సెక్షన్ విధింపు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Odisha : బక్రీద్ సందర్భంగా ఒడిశాలోని బాలాసోర్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇంటర్నెట్‌ను నిలిపివేసి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. బక్రీద్ నాడు ఈ ప్రాంతానికి చెందిన కొందరు ముస్లింలు గోవులను బలి ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో హిందూ సమాజానికి చెందిన ప్రజలు ఆగ్రహానికి గురయ్యారని పోలీసులు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇరు వర్గాల ప్రజలు ముఖాముఖికి రావడంతో తీవ్ర ఘర్షణలు కూడా జరిగాయి. ఈ సంఘటన బాలాసోర్‌లోని పత్రపద ప్రాంతంలో జరిగింది, ఇది మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతం. డ్రెయిన్‌లో నీరు ఎర్రగా మారడాన్ని స్థానికులు కొందరు చూశారు. అది గోవుల రక్తం అని అనుమానించారు.

కచ్చితంగా ఇది ఆవు రక్తమేనని హిందూ సంఘాల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. కొద్దిసేపటికే హిందువులు, ముస్లింల గుంపు ముఖాముఖిగా వచ్చి రాళ్లదాడి చేసుకోవడం మొదలు పెట్టాయి. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు సహా 15 మంది గాయపడ్డారు. జిల్లా యంత్రాంగం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. అయితే సోమవారం రాత్రి మళ్లీ ఆందోళనకు దిగడంతో ఒక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు మరో వర్గానికి చెందిన వారి ఇళ్లపై రాళ్లు, కర్రలు, గాజు సీసాలతో దాడి చేశారు.

Also Read

  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
  • AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
  • India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
  • Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?

Read Also:CM Revanth Reddy: నేడు మ‌ల్లేప‌ల్లి ఐటీఐలో ఏటీసీల‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌..

బాలాసోర్‌లోని గోలాపోఖారి, మోతిగంజ్, సినిమా చంక్ ప్రాంతాల్లో కూడా అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. పలు గ్రామాల ప్రజలపై దుండగులు రాళ్లు రువ్వారు. ఇళ్లకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించి రోడ్డును కూడా ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కూడా గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. బాలాసోర్ ఎస్పీ సాగరిక నాథ్ మాట్లాడుతూ, ‘మేము బాలాసోర్ పట్టణ ప్రాంతంలో కర్ఫ్యూ విధించాము. పుకార్లను అరికట్టేందుకు ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఘర్షణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

బాలాసోర్ ఎంపీ ప్రతాప్ సారంగి, ఎమ్మెల్యే మానస్ కుమార్ దత్ శాంతి కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొత్త ముఖ్యమంత్రి మోహన్ మాఝీ జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు. ఒడిశా సాధారణంగా దేశంలోని శాంతియుత రాష్ట్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. రాష్ట్రంలో చివరిసారిగా ఏప్రిల్ 2017లో భద్రక్‌లో కర్ఫ్యూ విధించారు. ఆ తర్వాత రామ నవమి సందర్భంగా మత ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read Also:Pawan Kalyan Security: పవన్‌ కల్యాణ్‌కు భద్రత పెంపు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bakrid
  • bakrid news
  • cow slaughter
  • India News
  • Odisha News

తాజావార్తలు

  • India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!

  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

  • AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..

  • India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!

  • Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions