Odisha : ఒడిశాలో బక్రీద్ రోజు చెలరేగిన హింస.. 144సెక్షన్ విధింపు
- ఒడిశాలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణ
- 144సెక్షన్ విధింపు
- ఇంటర్నెట్ బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha : బక్రీద్ సందర్భంగా ఒడిశాలోని బాలాసోర్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇంటర్నెట్ను నిలిపివేసి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. బక్రీద్ నాడు ఈ ప్రాంతానికి చెందిన కొందరు ముస్లింలు గోవులను బలి ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో హిందూ సమాజానికి చెందిన ప్రజలు ఆగ్రహానికి గురయ్యారని పోలీసులు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇరు వర్గాల ప్రజలు ముఖాముఖికి రావడంతో తీవ్ర ఘర్షణలు కూడా జరిగాయి. ఈ సంఘటన బాలాసోర్లోని పత్రపద ప్రాంతంలో జరిగింది, ఇది మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతం. డ్రెయిన్లో నీరు ఎర్రగా మారడాన్ని స్థానికులు కొందరు చూశారు. అది గోవుల రక్తం అని అనుమానించారు.
కచ్చితంగా ఇది ఆవు రక్తమేనని హిందూ సంఘాల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. కొద్దిసేపటికే హిందువులు, ముస్లింల గుంపు ముఖాముఖిగా వచ్చి రాళ్లదాడి చేసుకోవడం మొదలు పెట్టాయి. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు సహా 15 మంది గాయపడ్డారు. జిల్లా యంత్రాంగం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. అయితే సోమవారం రాత్రి మళ్లీ ఆందోళనకు దిగడంతో ఒక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు మరో వర్గానికి చెందిన వారి ఇళ్లపై రాళ్లు, కర్రలు, గాజు సీసాలతో దాడి చేశారు.
Also Read
- Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
Read Also:CM Revanth Reddy: నేడు మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..
బాలాసోర్లోని గోలాపోఖారి, మోతిగంజ్, సినిమా చంక్ ప్రాంతాల్లో కూడా అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. పలు గ్రామాల ప్రజలపై దుండగులు రాళ్లు రువ్వారు. ఇళ్లకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించి రోడ్డును కూడా ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కూడా గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. బాలాసోర్ ఎస్పీ సాగరిక నాథ్ మాట్లాడుతూ, ‘మేము బాలాసోర్ పట్టణ ప్రాంతంలో కర్ఫ్యూ విధించాము. పుకార్లను అరికట్టేందుకు ఇంటర్నెట్ను నిలిపివేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఘర్షణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
బాలాసోర్ ఎంపీ ప్రతాప్ సారంగి, ఎమ్మెల్యే మానస్ కుమార్ దత్ శాంతి కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొత్త ముఖ్యమంత్రి మోహన్ మాఝీ జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు. ఒడిశా సాధారణంగా దేశంలోని శాంతియుత రాష్ట్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. రాష్ట్రంలో చివరిసారిగా ఏప్రిల్ 2017లో భద్రక్లో కర్ఫ్యూ విధించారు. ఆ తర్వాత రామ నవమి సందర్భంగా మత ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also:Pawan Kalyan Security: పవన్ కల్యాణ్కు భద్రత పెంపు..
తాజావార్తలు
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!