Odisha : ఒడిశాలో బక్రీద్ రోజు చెలరేగిన హింస.. 144సెక్షన్ విధింపు
- ఒడిశాలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణ
- 144సెక్షన్ విధింపు
- ఇంటర్నెట్ బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha : బక్రీద్ సందర్భంగా ఒడిశాలోని బాలాసోర్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇంటర్నెట్ను నిలిపివేసి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. బక్రీద్ నాడు ఈ ప్రాంతానికి చెందిన కొందరు ముస్లింలు గోవులను బలి ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో హిందూ సమాజానికి చెందిన ప్రజలు ఆగ్రహానికి గురయ్యారని పోలీసులు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇరు వర్గాల ప్రజలు ముఖాముఖికి రావడంతో తీవ్ర ఘర్షణలు కూడా జరిగాయి. ఈ సంఘటన బాలాసోర్లోని పత్రపద ప్రాంతంలో జరిగింది, ఇది మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతం. డ్రెయిన్లో నీరు ఎర్రగా మారడాన్ని స్థానికులు కొందరు చూశారు. అది గోవుల రక్తం అని అనుమానించారు.
కచ్చితంగా ఇది ఆవు రక్తమేనని హిందూ సంఘాల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. కొద్దిసేపటికే హిందువులు, ముస్లింల గుంపు ముఖాముఖిగా వచ్చి రాళ్లదాడి చేసుకోవడం మొదలు పెట్టాయి. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు సహా 15 మంది గాయపడ్డారు. జిల్లా యంత్రాంగం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. అయితే సోమవారం రాత్రి మళ్లీ ఆందోళనకు దిగడంతో ఒక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు మరో వర్గానికి చెందిన వారి ఇళ్లపై రాళ్లు, కర్రలు, గాజు సీసాలతో దాడి చేశారు.
Also Read
- 10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
Read Also:CM Revanth Reddy: నేడు మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..
బాలాసోర్లోని గోలాపోఖారి, మోతిగంజ్, సినిమా చంక్ ప్రాంతాల్లో కూడా అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. పలు గ్రామాల ప్రజలపై దుండగులు రాళ్లు రువ్వారు. ఇళ్లకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించి రోడ్డును కూడా ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కూడా గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. బాలాసోర్ ఎస్పీ సాగరిక నాథ్ మాట్లాడుతూ, ‘మేము బాలాసోర్ పట్టణ ప్రాంతంలో కర్ఫ్యూ విధించాము. పుకార్లను అరికట్టేందుకు ఇంటర్నెట్ను నిలిపివేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఘర్షణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
బాలాసోర్ ఎంపీ ప్రతాప్ సారంగి, ఎమ్మెల్యే మానస్ కుమార్ దత్ శాంతి కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొత్త ముఖ్యమంత్రి మోహన్ మాఝీ జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు. ఒడిశా సాధారణంగా దేశంలోని శాంతియుత రాష్ట్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. రాష్ట్రంలో చివరిసారిగా ఏప్రిల్ 2017లో భద్రక్లో కర్ఫ్యూ విధించారు. ఆ తర్వాత రామ నవమి సందర్భంగా మత ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also:Pawan Kalyan Security: పవన్ కల్యాణ్కు భద్రత పెంపు..
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..