Bitcoin: దూసుకుపోతున్న క్రిప్టో మార్కెట్లు.. మూడేళ్ల తర్వాత 60వేలడాలర్లను తాకిన బిట్ కాయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bitcoin: ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ మళ్లీ పుంజుకుంటోంది. తాజా ర్యాలీతో మూడేళ్ల గరిష్ఠాన్ని తాకింది. 2021 తర్వాత తొలిసారి 60 వేల డాలర్ల స్థాయిని తాకింది. ప్రస్తుతం ఎగువన ట్రేడింగ్ అవుతోంది. మరో క్రిప్టో కరెన్సీ ఎథీరియం సైతం 3200 మార్క్ ఎగువన కొనసాగుతోంది. 2022 తర్వాత ఈ క్రిప్టోకు ఇదే గరిష్ఠ కావడం గమనార్హం. అయితే, క్రిప్టో కరెన్సీలు, ముఖ్యంగా బిట్ కాయిన్ ఇంతలా పెరిగేందుకు గల కారణాలేంటో చూద్దాం.
అమెరికాకు చెందిన ప్రముఖ క్రిప్టో ఇన్వెస్టర్, సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రో స్ట్రాటజీ.. ఇటీవల 155 మిలియన్ డాలర్లు వెచ్చించి 3 వేల బిట్ కాయిన్లను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. దీనికి తోడు బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కు అమెరికా ఆమోదం తెలపడం కూడా క్రిప్టో కరెన్సీలు రాణించేందుకు మరో కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంతోనే బిట్ కాయిన్ లో చాలా రోజుల తర్వాత మళ్లీ కొనుగోళ్లు వెల్లువెత్తున్నట్లు పేర్కొంటున్నాయి. 2021 లో క్రిప్టో కరెన్సీలు పరుగులు పెట్టాయి. ఆ ఏడాది జీవన కాల గరిష్ఠాలను అందుకున్నాయి.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also:Mudragada Padmanabham: 80 అసెంబ్లీ సీట్లు, సీఎం పదవి అడగాల్సింది.. పవన్ కళ్యాణ్కు ముద్రగడ లేఖ!
బిట్ కాయిన్ ఓ దశలో 60 వేల డాలర్ల మార్క్ కూడా దాటింది. ప్రపంచ వ్యాప్తంగా వీటిల్లో పెట్టుబడులు పెట్టే వారు భారీగా పెరిగారు. వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. చైనా, రష్యాలు క్రిప్టో కరెన్సీలను బ్యాన్ చేయడం.. రెండు సార్లు క్రిప్టో మార్కెట్లపై కొందరు కేటుగాళ్లు హ్యాకింగ్ కు పాల్పడడంతో మార్కెట్ పడిపోయింది. దాంతో పాటు ఇండియాలో ట్యాక్స్ 30శాతం విధించడంతో మన దేశంలో కూడా క్రిప్టో పై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆ సమయంలో చాలామంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మార్కెట్ భారీగా పడిపోవడంతో చాలా మంది కోట్లాది రూపాయలు నష్టపోయారు. ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఇన్నాళ్లు క్రిప్టో మార్కెట్ చాలా వరకు డౌన్ అయింది. చాలా రోజుల పాటు క్రిప్టో కరెన్సీలు కనిష్ఠ స్థాయిల్లో కొనసాగాయి. ముఖ్యంగా బిట్ కాయిన్ 20 వేల డాలర్ల స్థాయిలోనే ట్రేడింగ్ జరిపింది. అయితే, ఇప్పుడు రెండేళ్ల తర్వాత మళ్లీ బిట్ కాయిన్ పుంజుకోవడం గమనార్హం.
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఇన్నాళ్లు వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే వడ్డీ రేట్లలో కోత పెట్టింది. ముందు ముందు సైతం వడ్డీ రేట్లలో మరింత కోత పెట్టేందుకు అవకాశం ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. దీని కారణంగా మదుపరులు క్రిప్టో కరెన్సీల వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో క్రిప్టో కరెన్సీలకు డిమాండ్ పెరుగుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే, క్రిప్టో కరెన్సీలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో పెట్టుబడులపై రిస్క్ ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు.
Read Also:Disney Hotstar Merger : రిలయన్స్, డిస్నీ హాట్స్టార్ డీల్ ఓకే..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!