Site icon NTV Telugu

Tirumala: తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. కారణం ఇదేనా..?

Tirumala

Tirumala

తిరుమలలో రద్దీ భారీగా తగ్గింది. ఇవాళ ఆదివారం అయినా రద్దీ పెద్దగా కనిపించడం లేదు.. అయితే, సంక్రాంతి సెలవులు పూర్తి కావడంతో పాటు పరీక్షలు కూడా దగ్గరపడుతుండటంతో భక్తుల రాక తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఇక, సాధారణంగా శని, ఆదివారాల్లో అత్యధికంగా భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. కానీ, ఈ రోజు మాత్రం రద్దీ తక్కువగా ఉండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు సమయం తక్కువగా పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం గంటలోపే పూర్తి అవుతుంది.

Read Also: Sania Mirza: ఎంత కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటే.. అంతగా సక్సెస్‌ అవుతాం! సానియా పోస్ట్‌ వైరల్‌

కాగా, నిన్న తిరుమల శ్రీవారిని 76 వేల 41 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28 వేల 336 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకోని తమ మొక్కులు చెల్లించారు. అయితే, నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ బోర్డు అధికారులు వెల్లడించారు. కానీ, ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీనివాసుడి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక, సర్వ దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు దర్శన సమయం ఎనిమిది గంటలకు పైగా పడుతుంది.

Exit mobile version