Crime News: ఆస్తి కోసం ఏకంగా మొత్తం కుటుంబాన్నే హత్య చేసందుకు సుఫారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మేడ్చల్ జిల్లా అంకుశాపూర్లో ఆస్తి గొడవలో బావ కుట్ర బయట పడింది. తన భార్య లావణ్య తమ్ముడు బోనాల ఈశ్వర్ కుటుంబాన్ని హత్య చేయించేందుకు సుఫారీ ఇచ్చినట్లు ఘట్కేసర్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బోనాల ఈశ్వర్ సోదరి లావణ్యకు 2009లో మేడ్చల్కు చెందిన శ్రీనివాస్తో వివాహం జరిగింది. అప్పట్లో కట్నంగా ఒక ఎకరం భూమిని ఇచ్చారు. కానీ, 2020లో శ్రీనివాస్–లావణ్య దంపతులు మరింత ఆస్తి కావాలని వాదనలు పెట్టారు. ఈ నేపథ్యంలో గొడవ జరిగి, ఈశ్వర్ తమపై దాడి చేశాడని శ్రీనివాస్ ఘట్కేసర్ పోలీసులకు అప్పట్లోనే ఫిర్యాదు చేశాడు.
ఈ నేపథ్యంలో ఈశ్వర్ కుటుంబాన్ని హత్య చేయించేందుకు శ్రీనివాస్ టోలిచౌకికి చెందిన నలుగురు యువకులను నియమించాడు. బాబా షేక్ సాహిబ్ (20), ఎండి ఇఫ్రాన్ (20), ఎండి అబ్బూ (18), ఎండి సల్మాన్ (18) అనే వ్యక్తులకు ఈశ్వర్ ఇంటి ఫోటోలు, కుటుంబ సభ్యుల వివరాలతో సహా పంపించి రెక్కీ చేయమని చెప్పాడు. బుధవారం నలుగురు అంకుశాపూర్లో ఈశ్వర్ ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. ఈ నలుగురిని అనుమానంతో అదే గ్రామానికి చెందిన చిరంజీవి అనే కానిస్టేబుల్, మరికొంతమంది గ్రామస్థులు పట్టుకుని ప్రశ్నించారు. గట్టిగా మందలించడంతో వీరిలో నలుగురు అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. వారు సుఫారీ ద్వారా హత్య చేసేందుకు వచ్చారని వెల్లడించారు.
Also Read
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
- Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
దానితో ఈశ్వర్ వెంటనే ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో బావ శ్రీనివాస్తో పాటు, అతని భార్య లావణ్య, హత్యకు సుఫారీ ఇచ్చిన నలుగురిపై కేసు నమోదైంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను నేడు రిమాండ్కు తరలించే అవకాశముంది. ఆస్తి కోసం సొంత బంధువుల ప్రాణాలను అణచివేయాలన్న బావ శ్రీనివాస్ చర్య స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. గ్రామస్థుల అప్రమత్తతతో ఒక్క కుటుంబం పెనుముప్పు నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
-
Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!