CPI Narayana: ప్రజా సమస్యలను వదిలేసి.. ప్రధాని రాజకీయాలు మాట్లాడుతున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana Slams PM Modi Over Farmers Protest 2024: ప్రజా సమస్యలను వదిలేసి ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. రైతులు ఆందోళనలో ఉంటే జంతువులను వేటాడినట్లు వేటాడుతున్నారని, అన్నదాతలపై యుద్ధం సరికాదన్నారు. దేవుళ్లను కలిసే మోడీ.. సమస్యల్లో ఉన్న ప్రజలను ఎందుకు కలవరు? అని ప్రశ్నించారు. విగ్రహాలు తెచ్చానని గొప్పలు చెప్పుకునే మోడీ.. లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్లను ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోతున్నాడో బీజేపీ సమాధానం చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను వాడి.. విపక్షాలపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ… ‘ఎన్డీయే కూటమి బలహీనపడుతుంది. ఇండియా కూటమి బలపడుతుంది. బీహార్లో నితీష్ కుమార్ పోయిన కూటమి బలోపేతం అవుతుంది. పొత్తులో భాగంగా వయనాడులో డి రాజా భార్య ఆని రాజా పోటీ చేస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా మా పోరాటం ఉంటుంది.కేరళలో కాంగ్రెస్- కమ్యూనిస్టు పార్టీలే ఉన్నాయి. అక్కడ ఎవరు గెలిచినా.. కేంద్రంలో బీజేపీ రాకూడదన్నదే మా లక్ష్యం. ప్రజా సమస్యలను వదిలేసి ప్రధాని రాజకీయాలు మాట్లాడుతున్నారు. రైతులు ఆందోళనలో ఉంటే జంతువులను వేటాడినట్లు వేటాడుతున్నారు. అన్నదాతలపై యుద్ధం సరికాదు.రాముడిని, కృష్ణుడిని అడ్డంపెట్టుకుని ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవుళ్లను కలిసే మోడీ సమస్యల్లో ఉన్న ప్రజలను ఎందుకు కలవరు. విగ్రహాలు తెచ్చానని గొప్పలు చెప్పుకునే మోడీ.. లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్లను ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోతున్నాడో బీజేపీ సమాధానం చెప్పాలి?. ప్రజలకు మేలు చేసి ఉంటే ఇన్ని జిమ్మిక్కులు చెయ్యాల్సిన అవసరం వచ్చేదికాదు’ అని అన్నారు.
Also Read
- Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
- Cockroach Janta Party: "బొద్దింకల పార్టీ"పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
- Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. 'పెద్ది' సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
- Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
‘అడ్మినిస్ట్రేషన్ను ఉపయోగించుకొని ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. లిక్కర్ స్కాంలో అసలు నిందుతులను వదిలి కేజ్రీవాల్ టీంను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను వాడి విపక్షాలపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తున్నారు.17ఏ కత్తి పెట్టి నారా చంద్రబాబును లొంగదీసుకోవలనే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. వైఎస్ జగన్ ఎప్పుడో కేంద్రానికి లొంగిపోయాడు. 45వేల కోట్లు దోచిన 11 కేసుల్లో నిందుతుడిగా ఉన్న ఆయనపై చర్యలు లేవు. పిరికిపంద రాజకీయాలు చేసేవారు రాజకీయాల్లో ఉండటం సరికాదు. సొంత ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టొద్దు. జగన్ తన తండ్రి పేరు చెడగొట్టేందుకే పుట్టాడు. కేంద్రానికి అమ్ముడుపోయి తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. విభజన హామీల అమలు చేయకపోయినా.. బీజేపీ కాళ్ళు పట్టుకోవడం దారుణం. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి బీజేపీ, చంద్రబాబు, జగన్లకు వ్యతిరేకంగా పోరాడుతాం’ అని నారాయణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “బొద్దింకల పార్టీ”పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
-
Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
-
Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
-
Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!
-
Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!