Hyderabad: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. దంపతులు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడటంతో అటు వారి సొంత గ్రామంలోనూ, ఇటు వారు నివసిస్తున్న ప్రాంతంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీష దంపతులు ఘట్కేసర్–బీబీనగర్ రైల్వే మార్గంలోని ఎన్ఎఫ్సీ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దంపతులు ప్రస్తుతం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులో నివాసముంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం, లభ్యమైన ఆధారాల ప్రకారం, ఈ ఘోర ఘటన ఆత్మహత్యగా బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, దీనిపై పోలీసుల నుంచి ఇంకా అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ఈ దంపతులు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియనున్నాయి.
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!

Hyd
