Ponnam Prabahakar: ప్రతీ విషయంపై ట్విట్టర్లో స్పందించే కేసీఆర్ కుటుంబం.. మేడిగడ్డ ఘటనపై ఎందుకు స్పందించదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabahakar: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హుస్నాబాద్ను కోనసీమ చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఎం చెప్తారని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వివరాలు ట్విట్టర్లో పెట్టాలన్నారు. ప్రతీ విషయంపై సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు ట్విట్టర్లో సమాధానం చెప్తారని.. మేడిగడ్డ ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు ఏం జరిగిందో చెప్పడానికి ఎవరూ లేరన్నారు. డిజైన్ లోపమే బ్యారేజి కుంగడానికి కారణమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కట్టిన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదని..ఉక్కు కట్టడాలుగా నిలిచాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో కట్టిన కట్టడాలు ఎందుకు నేలకూలుతున్నాయని ఆయన విమర్శించారు.
Also Read: Amitshah-Pawan Kalyan: అమిత్ షాతో పవన్ భేటీ.. జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చ
Also Read
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని, కేంద్ర ప్రభుత్వం ఇంజనీర్లను పంపి విచారణ చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడి ప్రజలకు కాళేశ్వరం వాస్తవాలను తెలియపరచాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇంజినీర్ అవతారం ఎత్తినట్లు చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు నోరుమెదపడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో హుస్నాబాద్, గౌరవెల్లి ప్రాంతానికి కోనసీమగా చేస్తానని చెప్పి.. సీఎం కేసీఆర్ రైతులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి కాంగ్రెస్ శ్రేణులు, రైతులు తరలివెళ్లారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు, రైతులను బొమ్మారం వద్ద పోలీసులు అడ్డుకోగా.. కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్తో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మేడిగడ్డ సందర్శనకు అనుమతి ఇచ్చారు. నిర్మాణం జరిగినప్పుడు ఫోజులిచ్చిన నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!