Ponnam Prabahakar: ప్రతీ విషయంపై ట్విట్టర్లో స్పందించే కేసీఆర్ కుటుంబం.. మేడిగడ్డ ఘటనపై ఎందుకు స్పందించదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabahakar: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హుస్నాబాద్ను కోనసీమ చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఎం చెప్తారని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వివరాలు ట్విట్టర్లో పెట్టాలన్నారు. ప్రతీ విషయంపై సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు ట్విట్టర్లో సమాధానం చెప్తారని.. మేడిగడ్డ ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు ఏం జరిగిందో చెప్పడానికి ఎవరూ లేరన్నారు. డిజైన్ లోపమే బ్యారేజి కుంగడానికి కారణమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కట్టిన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదని..ఉక్కు కట్టడాలుగా నిలిచాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో కట్టిన కట్టడాలు ఎందుకు నేలకూలుతున్నాయని ఆయన విమర్శించారు.
Also Read: Amitshah-Pawan Kalyan: అమిత్ షాతో పవన్ భేటీ.. జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చ
Also Read
- Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని, కేంద్ర ప్రభుత్వం ఇంజనీర్లను పంపి విచారణ చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడి ప్రజలకు కాళేశ్వరం వాస్తవాలను తెలియపరచాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇంజినీర్ అవతారం ఎత్తినట్లు చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు నోరుమెదపడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో హుస్నాబాద్, గౌరవెల్లి ప్రాంతానికి కోనసీమగా చేస్తానని చెప్పి.. సీఎం కేసీఆర్ రైతులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి కాంగ్రెస్ శ్రేణులు, రైతులు తరలివెళ్లారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు, రైతులను బొమ్మారం వద్ద పోలీసులు అడ్డుకోగా.. కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్తో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మేడిగడ్డ సందర్శనకు అనుమతి ఇచ్చారు. నిర్మాణం జరిగినప్పుడు ఫోజులిచ్చిన నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదన్నారు.
తాజావార్తలు
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!