Priyanka Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు రూ.2 వేల సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: కర్ణాటకలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను ప్రారంభించింది. ఈ సందర్భంగా తాము గనుక అధికారంలోకి వస్తే ప్రతి మహిళ కుటుంబానికి రూ. 2,000 నెల నెలా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళా ఇంటి పెద్దకు నెలకు రూ. 2,000 ఇస్తామని సోమవారం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఈ ప్రకటన చేశారు, ‘గృహలక్ష్మి యోజన’ కింద సంవత్సరానికి రూ.24,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతుందని ప్రకటించారు.
మే నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలోని ప్రతి ఇంటికి ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ హామీ వెలువడింది. ‘గృహ లక్ష్మి యోజన’ అనేది ఎల్పీజీ ధరల భారాన్ని, మహిళ భరించే ఖరీదైన రోజువారీ ఖర్చులను పంచుకోవడానికి చేసిన ప్రయత్నమని పార్టీ పేర్కొంది. రాష్ట్రంలోని ప్రతి మహిళ సాధికారతతో పాటు తన కాళ్లపై తాను నిలబడే సామర్థ్యంతో పాటు తన పిల్లలను కూడా చూసుకునేలా ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. కర్ణాటకలోని ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందించాలని పార్టీ కోరుకుంటోందని పేర్కొంది. ఈ పథకం ద్వారా 1.5 కోట్ల మందికి పైగా మహిళలు లబ్ధి పొందుతారని పార్టీ తెలిపింది. రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేస్తామని, బీజేపీ పాలిత రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
Khammam BRS Meeting: 100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్.. కనీవినీ ఎరగని స్థాయిలో..
‘నా నాయకి’ అనే కార్యక్రమంలో ప్రియాంకగాంధీ మాట్లాడుతూ.. కర్ణాటకలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని విమర్శించారు. మంత్రులు ఉద్యోగాల్లో 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. కర్ణాటకలో రూ.1.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆమె ఆరోపించారు. బెంగళూరులో రూ.8,000 కోట్లతో జరగాల్సిన అభివృద్ధి గురించి ఆలోచించాలని, కానీ రూ. 3,200 కోట్లు కమీషన్గా మారుతోందని ఆమె ఆరోపించారు. ఆరోపించిన పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ స్కామ్ను ప్రస్తావిస్తూ.. కర్ణాటకలో లంచాలు ఇవ్వకుండా ఏదీ కదలదు అని ప్రియాంక గాంధీ అన్నారు. బోర్వెల్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, గృహాలు, బదిలీలు , ప్రభుత్వ పనులకు సంబంధించిన దాదాపు ప్రతిదానికీ ప్రజలు లంచాలు చెల్లించాల్సి వస్తోందని ఆమె విమర్శించారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!