Congress: యూపీలో 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ లిస్టు విడుదల.. రంగంలోకి సోనియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఓటింగ్ శుక్రవారమే జరగనుంది. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఇండియా కూటమిలో భాగంగా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తుతో రంగంలోకి దిగాయి. ఇప్పటికే అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించాయి. మరికొన్ని స్థానాలకు కాంగ్రెస్ ప్రకటించాల్సి ఉంది. అయితే యూపీలో అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: Vodafone Idea: నాణ్యమైన 5జీ సేవలు అందిస్తాం
Also Read
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
- Indian Rupee: రూపాయికి 'చీకటి' రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సచిన్ పైలట్, తదితరులు మొత్తం 40 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఇప్పటి వరకు రెండు విడతల్లో ప్రచారాలు ముగిశాయి.. కానీ ఇప్పటి వరకు సోనియా గాంధీ ఎక్కడా ప్రచారం నిర్వహించలేదు. కానీ ఈసారి మాత్రం ఆమె రంగంలోకి దిగుతున్నారు. యూపీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: Aadhi Pinisetty: వెకేషన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో దంపతులు..
ఆరోగ్య రీత్యా ఈసారి ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. అయితే రాయ్బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక్కడ ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు పేరు ప్రకటించలేదు. అలాగే అమేథీ సీటు కూడా ఇంకా ప్రకటించలేదు. ఇక్కడ సోనియా అల్లుడు, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. చివరికి రాహుల్ రంగంలోకి దిగుతారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతుంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. సెకండ్ ఏప్రిల్ 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక ప్రచారంలో ఆయా పార్టీలు దూసుకుపోతున్నాయి.

D
తాజావార్తలు
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!