Congress: యూపీలో 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ లిస్టు విడుదల.. రంగంలోకి సోనియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఓటింగ్ శుక్రవారమే జరగనుంది. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఇండియా కూటమిలో భాగంగా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తుతో రంగంలోకి దిగాయి. ఇప్పటికే అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించాయి. మరికొన్ని స్థానాలకు కాంగ్రెస్ ప్రకటించాల్సి ఉంది. అయితే యూపీలో అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: Vodafone Idea: నాణ్యమైన 5జీ సేవలు అందిస్తాం
Also Read
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సచిన్ పైలట్, తదితరులు మొత్తం 40 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఇప్పటి వరకు రెండు విడతల్లో ప్రచారాలు ముగిశాయి.. కానీ ఇప్పటి వరకు సోనియా గాంధీ ఎక్కడా ప్రచారం నిర్వహించలేదు. కానీ ఈసారి మాత్రం ఆమె రంగంలోకి దిగుతున్నారు. యూపీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: Aadhi Pinisetty: వెకేషన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో దంపతులు..
ఆరోగ్య రీత్యా ఈసారి ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. అయితే రాయ్బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక్కడ ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు పేరు ప్రకటించలేదు. అలాగే అమేథీ సీటు కూడా ఇంకా ప్రకటించలేదు. ఇక్కడ సోనియా అల్లుడు, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. చివరికి రాహుల్ రంగంలోకి దిగుతారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతుంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. సెకండ్ ఏప్రిల్ 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక ప్రచారంలో ఆయా పార్టీలు దూసుకుపోతున్నాయి.

D
తాజావార్తలు
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..