Vodafone Idea: నాణ్యమైన 5జీ సేవలు అందిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vodafone Idea: ప్రస్తుతం టెలికాం రంగంలో వొడాఫోన్ ఐడియా నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ సంస్థను బలోపేతం చేసేందుకు సంస్థ ప్రతినిధులు కష్ట పడుతున్నారు. దేశంలో జియో, ఎయిర్ టెల్ లతో వీఐకి గట్టి పోటీ ఉంటుందని.. వాటి ద్వారా తమ సంస్థ చాలా మంది వినియోగదారులను కోల్పోయిందని ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా అన్నారు. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా సమీకరించిన రూ.18 వేల కోట్లు వొడాఫోన్ కు పునర్జీవం లాంటి వన్నారు. మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తప్పకుండా పుంజుకుంటామని ఆయన పేర్కొన్నారు. గురువారం ఎఫ్ పీఓ లిస్టింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన 5జీ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వీఐ 2.0 ప్రారంభం కాబోతోందని స్పష్టం చేశారు. కంపెనీ పుంజుకోవడంతో ప్రభుత్వం చొరవ ఎనలేనిదన్నారు.
READ NORE: T20 World Cup: ‘టీ20 ప్రపంచకప్ గెలవాలంటే..’ కోచ్ ద్రవిడ్కు ప్రత్యేక సలహా ఇచ్చిన మాజీ క్రికెటర్..
Also Read
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
ప్రభుత్వ చొరవ వల్లే టెలికాం రంగంలో మూడో స్థానంలో నిలిచామని తెలిపారు. వీఐని దేశ సంపద అన్నారు. మూలధన సమీకరణలో కంపెనీ సమస్యలు కుదటపడతాయా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఇది కంపెనీని పునర్జీవం లాంటి దన్నారు. ప్రస్తుతం 21.5 కోట్ల మందికి సేవలందిస్తున్నట్లు పేర్కొ్న్నారు. ఇండస్ టవర్స్ లో వాటాల విక్రయంపై అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వలేదు. వొడాఫోన్ ప్రమోటర్లు, ఆదిత్యా బిర్లా గ్రూప్ కలిసి ఇప్పటి వరకు రూ.1.70 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు. గత అయిదేళ్లలోనే దాదాపు రూ. 30 వేల కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కంపెనీ కొంత మేరకు పుంజుకుందని తెలిపారు. కంపెనీ అప్పులు రూ. 4 వేల కోట్లకు తగ్గయని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్ బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్ మాట్లాడుతూ.. మనది పెద్ద దేశమని మన దేశానికి మూడు టెలికాం సంస్థలు అవసరమన్నారు. కంపెనీని కాపాడుకునేందుక బిర్లా తన వ్యక్తి గత సొమ్ముతోపాటు ప్రపంచంలోని పెట్టుబడిదారుల నుంచి డబ్బును పోగు చేశారని తెలిపారు. బీఎస్ఈలో వొడాఫోన్ ఐడియా స్టాక్ 5.27 శాతం లాభపడగా.. రూ.1378 వద్ద ముగిసింది.
తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!