Postcard Movement : రాహుల్ గాంధీపై అనర్హతపై పోస్టుకార్డు ఉద్యమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించనుంది. ఇవాళ గాంధీ భవన్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే ఈ ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు. అలాగే ఈ నెల 8న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. ఆదివారం గాంధీభవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Also Read : Liquor Price Hiked: మద్యం ప్రియులకు బాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఏఐసీసీ పిలుపునిచ్చిన జై భారత్ సత్యాగ్రహ దీక్షల కార్యచరణను ఖరారు చేసేందుకు టీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో మాణిక్ రావు థాక్రేతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావెద్, చిన్నారెడ్డి, టీపీసీసీ వర్కింట్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలె పోదెం వీరయ్య, సీతక్క, పీసీసీ మాజీ అధ్యక్షులు వి. హన్మంత్ రావు, పొన్నాల లక్ష్మయ్య, కేంద్రమాజీ మంత్రి బలరాం నాయక్, పార్టీ ముఖ్య నేతలు పొన్నం ప్రభాకర్, నాగం జనార్థన్ రెడ్డి, కొండా సురేఖ, మల్లు రవితో పాటు పలువురు పాల్గొన్నారు.
Also Read : Liquor Price Hiked: మద్యం ప్రియులకు బాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు
ఏఐసీసీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు నిర్వహించని నేతలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాలను నేతలంతా బాధ్యతాయుతంగా చేపట్టాలని, అందరినీ భాగస్వాములను చేయాలని థాక్రే పిలుపునిచ్చారు. రాష్ట్రంలో హాథ్ సే హాథే జోడో యాత్రలను పకడ్బందిగా నిర్వహించారని.. రేవంత్ రెడ్డి 30 నియోజకవర్గా్లో యాత్ర విజయవంతమైందని థాక్రే వెల్లడించాడు. రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంటింటికీ అందించాలని చెప్పారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరుకానీ నాయకులను పదవుల నుంచి తొలగించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటి వరకు టీపీసీసీ కార్యవర్గ సమావేశాలు ఐదుసార్లు జరగ్గా ఈ సమావేశాలకు ఒక్కసారి కూడా రాని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను 24 గంటల్లోగా పదవుల నుంచి తొలగించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ను రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!