Nirmal: బ్లాక్ మెయిలర్లు, చీటర్లు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు.. కాంగ్రెస్ నేతల నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లు మంత్రిగా ఉండి అధికార దాహంతో అక్రమంగా సంపాదించుకున్న అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో హస్తం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు నివాసం వద్ద మాజీ మంత్రిని చేర్చుకోవద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడికి వినతిపత్రం అందజేశారు. మాజీమంత్రి అతని కుటుంబీకులు అక్రమంగా ఆక్రమించుకున్న చెరువులు, కందకాలు డి1 పట్టాలను కాపాడుకోడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
గత రాజకీయ చరిత్ర అంతా ఊసరవెల్లి లాగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండా పట్టుకుంటూ, 30 సంవత్సరాల రాజకీయంలో విలువలు సిద్ధాంతం లేని వ్యక్తి మాజీ మంత్రి అల్లోల అని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. గత పది సంవత్సరాలుగా మంత్రిగా ఉండి కనిపించిన చెరువుని, గుడిని గుడిలో ఉన్న లింగాన్ని భూములను, మున్సిపల్ ఉద్యోగాల్లో అవినీతికి పాల్పడి ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. మాజీ మంత్రి కుటుంబ అధికార దాహాన్ని భరించలేకనే ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెడితే.. సిగ్గు లేకుండా అధికార పార్టీలోకి వస్తా అంటున్నావని మండిపడ్డారు. 78 సంవత్సరాలు వచ్చినా.. ఇంకా అధికార దాహం తీరలేదా అని ప్రశ్నించారు. ఇలాంటి నాయకున్ని పార్టీలో చేర్చుకోవద్దంటూ సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించాలని కోరారు. కబ్జా మాజీ మంత్రి పార్టీలోకి వస్తే కాంగ్రెస్ కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
Also Read
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేత..
మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దంటూ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్కకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. అవినీతి భూకబ్జాల బీఆర్ఎస్ నేత మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దంటూ విన్నవించారు.
బ్లాక్ మెయిలర్స్, చీటర్లను పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు..
బ్లాక్ మెయిలర్స్, చీటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జూ అన్నారు. మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ లోకి చేర్చుకోవద్దంటూ నిరసన ఆందోళన కార్యక్రమాలను పార్టీ అధిష్టానం గమనిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చే విషయం తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!