NTV Telugu Site icon

Jairam Ramesh: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఖండించిన కాంగ్రెస్.. పాలస్తీనా ప్రజల సమస్యకు పరిష్కారం కావాలి

Jai Ram Ramesh

Jai Ram Ramesh

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని కాంగ్రెస్ ఖండించింది. పాలస్తీనా ప్రజల సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ ఎప్పటి నుంచో విశ్వసిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ఏ విధమైన హింస నుండి పరిష్కారం రాదని.. దాడిని ఇండియా ఖండించిందని, ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తుందని ప్రధాని మోడీ అన్నారని కాంగ్రెస్ పేర్కొంది. నిన్న(శనివారం) ఇజ్రాయెల్ దాడిపై బీజేపీ కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ముంబై ఉగ్రదాడితో సహా దేశవ్యాప్తంగా జరిగిన వివిధ ఉగ్రవాద సంఘటనల ఉదాహరణలను ఉటంకిస్తూ.. ఇజ్రాయెల్ ఈ రోజు ఎదుర్కొంటోందని బీజేపీ తెలిపింది. 2004-14 మధ్య భారతదేశం అదే ఎదుర్కొంది. ఎప్పటికీ క్షమించవద్దు, ఎప్పటికీ మర్చిపోవద్దు అని బిజెపి పేర్కొంది. బీజేపీ విడుదల చేసిన వీడియోలో ‘ప్రతి ఉగ్రవాద దాడిని ఆపడం చాలా కష్టం’ అని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కూడా చేర్చారు.

OnePlus Nord CE 3 Lite 5G Price: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ ధర!

ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌తో భారత్‌కు వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌లో ఉగ్రవాద దాడులపై ప్రధాని మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో భారతదేశం ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలుస్తుందని అన్నారు. హమాస్ దాడుల తర్వాత.. ఇజ్రాయెల్ భారతదేశానికి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. భారత్‌కు ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిల్లాన్ భారతదేశం నైతిక మద్దతును ప్రశంసించారు. మరోవైపు ఇజ్రాయెల్ కు అండగా.. భారత్, అమెరికా, బ్రిటన్‌లు నిలుస్తున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్ హమాస్‌కు మద్దతు ఇస్తున్నాయి. దీంతో పాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ పాలస్తీనాకు మద్దతు పలికాయి.

Indian Air Force: భారత వైమానిక దళం ధైర్యానికి ప్రధాని మోడీ సెల్యూట్..

శనివారం హమాస్, ఇజ్రాయెల్‌లోకి చొరబడి వేల రాకెట్లను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇజ్రాయెల్‌లో దాదాపు 300 మంది మరణించగా, గాజాలో 232 మంది మరణించారు.