Karnataka Election: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ప్రియాంక్ ఖర్గేకు ఈసీ షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Election: ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలను ప్రాథమికంగా మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు పేర్కొన్న ఎన్నికల సంఘం.. ఆయన వైపు నుంచి ఎటువంటి స్పందన లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. రేపటిలోగా స్పందించాలని ఆదేశించింది. గత వారం కర్ణాటకలో జరిగిన ఎన్నికల సభలో ప్రియాంక్ ఖర్గే ప్రధాని ప్రసంగాన్ని ఉటంకించారు. కలబురగి జిల్లాలోని చిత్తాపూర్లో ప్రియాంక్ మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల విషయంలో ప్రధాని, ఆయన పార్టీ గందరగోళం సృష్టించిందని అన్నారు. బంజారా కమ్యూనిటీ కుమారుడినని చెప్పుకుంటున్న ఆయన షెడ్యూల్డ్ కులాల పరిస్థితి ఆగం చేశారని ఆరోపించారు. ప్రధాని బంజారాల కొడుకు కాదని, పనికిరాని కొడుకు (నలాయక్ బేటా) అని ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధానిని కించపరిచే విధంగా తన తండ్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రియాంక్ ఖర్గే తన తండ్రి మల్లికార్జున్ ఖర్గేను దుర్వినియోగ రాజకీయాలలో మించిపోతున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం అన్నారు. “ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీకి కర్ణాటక ప్రజలు విపరీతమైన మద్దతును అందించడం చూసి కాంగ్రెస్ నాయకులు విసుగు చెందుతున్నారు. అందుకే కాంగ్రెస్ నాయకులు మళ్లీ మోడీజీని, ఆయన కుటుంబాన్ని, సమాజాన్ని దుర్భాషలాడారు” అని ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని మోదీపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ప్రియాంక్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన ఒక రోజు తర్వాత ప్రియాంక్కి నోటీసు వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని కాంగ్రెస్ పేర్కొంది.
Also Read
Read Also: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో ఈడీ తప్పిదం.. ఆప్ నేతకు క్షమాపణలు
ఇదిలా ఉండగా.. సోనియా గాంధీని ఉద్దేశించి అభ్యంతరకర పదజాలం వాడినందుకు బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ ఆర్ పాటిల్కి కూడా ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు ఇచ్చింది. బసనగౌడ బీజేపీ స్టార్ క్యాంపెయినర్. ఇటీవల, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీకి ‘విషపూరిత పాము’ అనే పదాన్ని ఉపయోగించగా, బసనగౌడ సోనియా గాంధీకి ‘విష కన్య ‘ అని అభివర్ణించారు. ఆమె చైనాకు అండగా ఉంటూ..భారతదేశంపై ఆరోపణలు చేశారని, ఆమె పాకిస్థాన్ ఏజెంట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
-
Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..