Site icon NTV Telugu

UP: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీలో కలకలం.. రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ రాజీనామా!

New Project (57)

New Project (57)

బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్ గురువారం తన రాజీనామా చేశారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన కొద్ది రోజులకే భూపేంద్ర సింగ్ ఈ చర్య తీసుకున్నారు.

READ MORE: NDA Alliance: ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!

భూపేంద్ర సింగ్ నేతృత్వంలో ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ తన ప్రత్యర్థి పార్టీ సమాజ్‌వాదీ పార్టీ కంటే చాలా వెనుకబడిపోయింది. బీజేపీకి చెందిన పలువురు కేంద్ర మంత్రులతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. యుపిలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వాటిలో 36 సమాజ్‌వాదీ పార్టీ, 33 బీజేపీ, 6 కాంగ్రెస్, 2 ఆర్‌ఎల్‌డి, 1 ఆజాద్ సమాజ్ పార్టీ ఒకటి గెలుచుకున్నాయి. ఈ విషయమై రాష్ట్ర, కేంద్ర స్థాయిలో మేధోమథనం జరిగింది. బీజేపీ అగ్ర నేతలతో చర్చించేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గురువారం ఢిల్లీ వెళ్లారు. కాగా, గురువారం రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామాకు సిద్ధమయ్యారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయమై రాష్ట్ర అధ్యక్షుడిని సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఈ వార్తల్లో వాస్తవం లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ బహదూర్ పాఠక్ అన్నారు. బీజేపీ నగర్‌ ఎమ్మెల్యే రితేష్‌ గుప్తా రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేసే ప్రసక్తే లేదని ధృవీకరించారు.

Exit mobile version