Aggregator Cab Policy: ఇక ఓలా, ఉబర్ డ్రైవర్లకు దబిడి దిబిడే.. రైడ్ క్యాన్సిల్ చేస్తే కస్టమర్లకు డబ్బులే డబ్బులు!
Aggregator Cab Policy: ఓలా, ఉబర్ ప్రయాణికులకు ఒక శుభవార్త. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అగ్రిగేటర్ క్యాబ్స్ పాలసీ 2025 కింద కొత్త ఆదేశాన్ని అమలులోకి తీసుకవచ్చింది. దీని ప్రకారం ఓలా, ఉబర్, రాపిడో వంటి ప్రముఖ రైడ్-హెయిలింగ్ సేవలు డ్రైవర్ రైడ్ను రద్దు చేసుకుంటే వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం రాష్ట్రంలోని రైడ్ షేరింగ్ వ్యవస్థ అంతటా మరింత మెరుగైన కస్టమర్ అనుభవాన్ని తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఇక ముంబై, పూణే, నాగ్పూర్ వంటి మెట్రో నగరాల్లోని కస్టమర్లు, ముఖ్యంగా రద్దీ సమయాల్లో వాతావరణం సరిగా లేని సమయంలో లేదా క్యాబ్ డ్రైవర్లకు తక్కువ లాభదాయకంగా అనిపించే ప్రాంతాలలో రైడ్ క్యాన్సల్ చేయడం సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని కొత్త నిబంధనలను అమలు చేసింది.
Read Also: Rahul Gandhi: “శ్రీరాముడి”పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిందూ వ్యతిరేకి’’ అని బీజేపీ విమర్శలు..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఇక ఈ రైడ్ రద్దు గురించి పాలసీ ఏమి చెబుతుందన్న విషయానికి వెళితే.. స్టేట్ అగ్రిగేటర్ క్యాబ్స్ పాలసీ 2025 స్పష్టంగా చెప్పేదేంటంటే.. డ్రైవర్ ఒక రైడ్ను అంగీకరించి, సరైన కారణం లేకుండా దానిని రద్దు చేస్తే అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ కస్టమర్కు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ పరిహార విధానాన్ని బట్టి తదుపరి ట్రిప్లో పరిహారం చిన్న క్రెడిట్ క్యాష్బ్యాక్ లేదా ఛార్జీ తగ్గింపు రూపంలో ఉండేలా చేస్తుంది. మహారాష్ట్రలోని నగరాలు, పట్టణాలలో ప్రధాన సమస్యగా మారిన అనవసరమైన రైడ్ రద్దులను నిరుత్సాహపరచడానికి ఈ నియమం ఉద్దేశించబడింది. అత్యవసర పరిస్థితి లేదా సాంకేతిక సమస్య ఉంటే తప్ప, డ్రైవర్ రైడ్ను అంగీకరించిన తర్వాత అతను లేదా ఆమె దానిని గౌరవించాలని ఈ విధానం నొక్కి చెబుతుంది.
Read Also: Greg Abel: వారెన్ బఫెట్ వారసుడిగా ‘గ్రెగ్ అబెల్’.. లక్షల కోట్ల కంపెనీకి కొత్త సీఈఓగా బాధ్యతలు!
రైడ్ రద్దు వల్ల వేలాది మంది రోజువారీ ప్రయాణికులకు అసౌకర్యం కలగడమే కాకుండా.. ముఖ్యమైన సమావేశాలకు హాజరు కాకపోవడం, అలాగే ప్రజల సమయం వృధా కావడం, వినియోగదారులు నిరాశ చెందడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకు డ్రైవర్లకు ఎటువంటి జరిమానా విధించకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. 2025 విధానం ఇప్పుడు అమలులోకి రావడంతో ఓలా, ఉబెర్, రాపిడో తమ డ్రైవర్ల సముదాయాన్ని ఎలా పర్యవేక్షించాలో ఇంకా ఎలా నిర్వహించాలో పునరాలోచించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రయాణికులు ఇప్పుడు చివరి నిమిషంలో రద్దు అవుతుందనే భయం లేకుండా మెరుగైన, నమ్మదగిన సేవను ఆశించవచ్చు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!