Site icon NTV Telugu

Kota Bommali PS : ఓటీటీలోకి వచ్చేస్తున్నా ‘కోట బొమ్మాళి పీఎస్’.. అఫీషియల్ అప్డేట్ ఇచ్చిన ఆహా..

Whatsapp Image 2024 01 01 At 11.31.22 Am

Whatsapp Image 2024 01 01 At 11.31.22 Am

సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్ర లో నటించిన ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా నవంబర్ 24 న థియేటర్ల లో విడుదల అయి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.మంచి వసూళ్లతో డీసెంట్ హిట్ అందుకుంది.మలయాళం హిట్ మూవీ నాయట్టుకు రీమేక్‍ గా ఈ చిత్రం తెరకెక్కింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘కోట బొమ్మాళి పీఎస్’కు తేజ మర్ని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమం లో ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ స్ట్రీమింగ్ గురించి అప్‍డేట్ ఇచ్చింది.కోట బొమ్మాళి పీఎస్ చిత్రాన్ని సంక్రాంతికి స్ట్రీమింగ్‍ కు తీసుకురానున్నట్టు ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. “రాజకీయ వ్యవస్థను, నాయకులను ప్రశ్నించి నిలదీసిన ముగ్గురు పోలీసుల కథ. ఈ సంక్రాంతికి.. ఆహాలో. మీ పండుగ మూవీ లిస్టుకు మరింత డోస్ యాడ్ చేస్తున్నాం” అని వెల్లడించింది.

అయితే, సంక్రాంతికి కోట బొమ్మాళి సినిమాను స్ట్రీమింగ్‍కు తెస్తామని చెప్పిన ఆహా తేదీని మాత్రం వెల్లడించలేదు. అయితే, జనవరి 14 న ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తుందని తెలుస్తోంది.కోట బొమ్మాళి పీఎస్ చిత్రంలో శ్రీకాంత్‍ తో పాటు రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ మరియు శివానీ రాజశేఖర్ కీలక పాత్రలు చేశారు. తేజ మర్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి రజినీ రాజ్ సంగీతం అందించారు.ఈ సినిమాలో ‘లింగి లింగి లింగిడి’ అనే జానపదం పాట తో ఈ చిత్రానికి రిలీజ్‍కు ముందే మంచి పాపులారిటీ వచ్చింది.కోట బొమ్మాళి చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాస్ మరియు విద్య కొప్పినీడి ప్రొడ్యూజ్ చేశారు. పోలీసులను రాజకీయ నాయకులు ఏవిధంగా వాడుకుంటున్నారనే కథాంశం తో ఈ మూవీ తెరకెక్కింది. థియేటర్స్ లో ఎంతగానో అలరించిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Exit mobile version