Cold Wave: చలిగాలుల కారణంగా 100 మందికి పైగా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cold Wave: తీవ్రమైన శీతల వాతావరణం, కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం కారణంగా గత రెండు వారాల్లో ఆఫ్ఘనిస్తాన్లో 100 మందికి పైగా మరణించారని ఆదివారం తాలిబాన్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వివిధ ప్రావిన్స్లలో కనీసం 104 మంది మరణించారని, 50 ఇళ్లు ధ్వంసమయ్యాయని తాలిబాన్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ ప్రతినిధి షఫయ్ రహిమి చెప్పారు.
తాలిబాన్ ప్రకారం.. 15 ప్రావిన్సులలో మరణాలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్లోని ఘోర్ ప్రావిన్స్కు చెందిన అబ్దుల్ జహీర్ చలి వాతావరణం కారణంగా తన పిల్లలలో ఒకరిని కోల్పోయామని, ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక పరిస్థితులతో పోరాడుతున్నామని చెప్పారు. తనపిల్లలందరూ అనారోగ్యంతో ఉన్నారని.. వారిలో ఒకరు మరణించారని ఆయన చెప్పారు.
దేశంలో చాలా మంది విపరీతమైన చలి కారణంగా బాధించబడుతున్నారని తెలిసింది. ఈ చలిగాలుల కారణంగా చాలా కుటుంబాలకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు, వారు ఇళ్లలో వెచ్చదనం కోసం ప్రత్యామ్నాయం కూడా లేదని ఫర్యాబ్ ప్రావిన్స్ నివాసి మహ్మద్ అజీమ్ వెల్లడించారు. తాలిబాన్ నేతృత్వంలోని సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గణాంకాల ఆధారంగా.. గత రెండు వారాలుగా చలి కారణంగా పదివేల పశువులు చనిపోయాయని తెలిసింది.
Also Read
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
Bride Cancels Marriage: వరుడికి అది రాదని పెళ్లికి నిరాకరించిన యువతి
ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్లో కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం కారణంగా కనీసం 140 మంది ఆసుపత్రి పాలైనట్లు టోలో న్యూస్ ఇటీవల నివేదించింది. ఆసుపత్రి పాలైన వారిలో చాలా మంది చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.
దేశంలో కట్టెలు, ఇతర ప్రాథమిక సౌకర్యాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నందున కఠినమైన శీతాకాలాల మధ్య తమ ఇళ్లను వేడి చేయడానికి గ్యాస్ను ఏకైక ఎంపికగా ఉపయోగిస్తున్నామని హెరాత్ నివాసితులు తెలిపారు.అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పడిపోవడం ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పటికే పేదరికం, ఆహారం, ఇంధనం కొరత కారణంగా ఇబ్బందుల్లో ఉన్న దేశంలో పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!