Cold Wave: చలిగాలుల కారణంగా 100 మందికి పైగా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cold Wave: తీవ్రమైన శీతల వాతావరణం, కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం కారణంగా గత రెండు వారాల్లో ఆఫ్ఘనిస్తాన్లో 100 మందికి పైగా మరణించారని ఆదివారం తాలిబాన్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వివిధ ప్రావిన్స్లలో కనీసం 104 మంది మరణించారని, 50 ఇళ్లు ధ్వంసమయ్యాయని తాలిబాన్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ ప్రతినిధి షఫయ్ రహిమి చెప్పారు.
తాలిబాన్ ప్రకారం.. 15 ప్రావిన్సులలో మరణాలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్లోని ఘోర్ ప్రావిన్స్కు చెందిన అబ్దుల్ జహీర్ చలి వాతావరణం కారణంగా తన పిల్లలలో ఒకరిని కోల్పోయామని, ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక పరిస్థితులతో పోరాడుతున్నామని చెప్పారు. తనపిల్లలందరూ అనారోగ్యంతో ఉన్నారని.. వారిలో ఒకరు మరణించారని ఆయన చెప్పారు.
దేశంలో చాలా మంది విపరీతమైన చలి కారణంగా బాధించబడుతున్నారని తెలిసింది. ఈ చలిగాలుల కారణంగా చాలా కుటుంబాలకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు, వారు ఇళ్లలో వెచ్చదనం కోసం ప్రత్యామ్నాయం కూడా లేదని ఫర్యాబ్ ప్రావిన్స్ నివాసి మహ్మద్ అజీమ్ వెల్లడించారు. తాలిబాన్ నేతృత్వంలోని సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గణాంకాల ఆధారంగా.. గత రెండు వారాలుగా చలి కారణంగా పదివేల పశువులు చనిపోయాయని తెలిసింది.
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
Bride Cancels Marriage: వరుడికి అది రాదని పెళ్లికి నిరాకరించిన యువతి
ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్లో కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం కారణంగా కనీసం 140 మంది ఆసుపత్రి పాలైనట్లు టోలో న్యూస్ ఇటీవల నివేదించింది. ఆసుపత్రి పాలైన వారిలో చాలా మంది చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.
దేశంలో కట్టెలు, ఇతర ప్రాథమిక సౌకర్యాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నందున కఠినమైన శీతాకాలాల మధ్య తమ ఇళ్లను వేడి చేయడానికి గ్యాస్ను ఏకైక ఎంపికగా ఉపయోగిస్తున్నామని హెరాత్ నివాసితులు తెలిపారు.అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పడిపోవడం ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పటికే పేదరికం, ఆహారం, ఇంధనం కొరత కారణంగా ఇబ్బందుల్లో ఉన్న దేశంలో పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!