Chandrababu-Daggubati: మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి తోడల్లుళ్లు!
- నేడు 'ప్రపంచ చరిత్ర' పుస్తక ఆవిష్కరణ
- మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి తోడల్లుళ్లు
- ఆవిష్కరణకు హాజరుకానున్న కేంద్రమంత్రి నిర్మల సీతారామన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు దశాబ్దాల తర్వాత తోడల్లుళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఒకే వేదికపైకి రాబోతున్నారు. వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ అనే పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా చంద్రబాబు రానున్నారు. గురువారం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. పుస్తక ఆవిష్కరణ కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. అర్ధరాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. ఈ కార్యక్రమంకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరుకానున్నారు.
చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో తరచుగా కలుసుకుంటున్నారు. అయితే ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం మాత్రం 30 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇటీవలే ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన దగ్గుబాటి.. పుస్తకావిష్కరణ కార్యక్రమంకు రావాలని ఆహ్వానించారు. దగ్గుబాటి రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రచురించారు. తెలుగు పుస్తకాన్ని వెంకయ్యనాయుడు, ఆంగ్ల పుస్తకాన్ని నిర్మలా సీతారామన్ ఆవిష్కరించనున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు సతీమణి పురందేశ్వరి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంను దగ్గరుండి చూసుకుంటున్నారు. పుస్తకావిష్కరణ తర్వాత గీతం ప్రాంగణంలో జరుగుతున్న జాబ్ మేళాలో యువతతో సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. అనంతరం సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు.
Also Read
తాజావార్తలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి.. మరో సూపర్హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!