NTV Telugu Site icon

CM Jagan: రేపు విజయవాడలో సీఎం వైఎస్ జగన్‌ పర్యటన

Jagan

Jagan

CM Jagan: సీఎం వైఎస్ జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాలలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంకు చేరుకుంటారు. అజాద్ జయంతి సందర్భంగా మైనారిటీస్‌ వెల్పేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే సందర్భంగా భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాలలో పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. మరోవైపు జగన్ పర్యటన సందర్భంగా విజయవాడలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.