CM Revanth Reddy : కిషన్ రెడ్డి సైందవ పాత్ర పోషిస్తున్నాడు
- కిషన్ రెడ్డి.. మోడీ భజన చేస్తున్నారు
- బీహార్, యూపీకి ఇస్తున్న ప్రాధాన్యం తెలంగాణకు ఇవ్వడం లేదు
- కిషన్ రెడ్డి వల్లే మూసీ, మెట్రో ఆగింది
- కిషన్ రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారు. : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల వరకు తీసుకెళ్లే అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ, “కిషన్ రెడ్డి మాటలు వింటుంటే రైల్లో మనకే డబ్బులు పంపినట్టు మాట్లాడుతున్నారు. ప్రజల నుంచి అడిగి హామీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మేము అడుగుతున్నది మీ మోడీ సొమ్ము కాదు, మీ ఆస్తి కాదు. మేము కడుతున్న పన్నులు తిరిగి ప్రజల అభివృద్ధికి వెచ్చించాలి. కానీ, మీరు అడ్డుకోవడం వల్లనే మెట్రో ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదు” అని వ్యాఖ్యానించారు.
“తెలంగాణకు మెట్రో అవసరమైతే, మీరెందుకు అడ్డుకుంటున్నారు? మీ దగ్గర నిధులు ఉన్నాయా? డిల్లీలో యమున నదిని శుద్ధి చేస్తామని చెప్పే బీజేపీ, తెలంగాణ అభివృద్ధికి అడ్డు పడుతోంది. కిషన్ రెడ్డి ‘సైందవ పాత్ర’ పోషిస్తున్నాడు. రీజినల్ రింగ్ రోడ్ (RRR) కేంద్ర కేబినెట్లోకి రాకపోవడం వెనుక మీ ఆటలు ఏంటి?” అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు.
Also Read
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
“ఆరేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, తెలంగాణకు ఏ ప్రత్యేక ప్రాజెక్టును తీసుకొచ్చారు? ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పగలరా? మీరే కేంద్ర మంత్రులను ఒత్తిడి చేసి, మెట్రో విస్తరణను అజెండాలో పెట్టొద్దని చెప్పిన విషయాన్ని నిరూపించగలరా?” అని సవాల్ విసిరారు. “తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్ పరిశ్రమను గుజరాత్ తరలించారు. అదనంగా తెలంగాణకు ఏ పరిశ్రమను కేటాయించారు? మేము అడిగిన ప్రతీ దానికి బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులను మాదే చెప్తారు. కానీ, కిషన్ రెడ్డి మాత్రం ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధికి అనుకూలంగా మాట్లాడలేరు” అని విమర్శించారు.
“కిషన్ రెడ్డి, కేసీఆర్ చీకటి మిత్రులు. కేసీఆర్ అధికారం పోయిందని బాధపడుతున్నాడు, కిషన్ రెడ్డి అదే బాధతో ఉన్నాడు. తెలంగాణకు రావాల్సిన నిధులను అడ్డుకుంటూ, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారారు” అని వ్యాఖ్యానించారు. “బీజేపీ నిజంగా మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటే, పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, గుజరాత్లో ఎందుకు రద్దు చేయడం లేదు? తెలంగాణలో మాత్రమే రద్దు చేయాలని కిషన్ రెడ్డి కోరడం దేనికి సంకేతం? మాదిగల ఉప కులాల విభజన అమలును ఏపీ సీఎం చంద్రబాబుతో చేయిస్తారా? దమ్ముందా?” అని రేవంత్ నిలదీశారు.
“కిషన్ రెడ్డి, నీ ఇంటికొచ్చి వినతిపత్రం ఇచ్చాను. ప్రతీసారి ఎదురుపడినప్పుడు, తెలంగాణ మెట్రో గురించి అడిగాను. తెలంగాణకు రావాల్సిన నిధుల మంజూరు ఎప్పుడు జరుగుతుందో స్పష్టత ఇవ్వండి. బెదిరించి బతికే రోజులు పోయాయి” అని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ హామీ ఇచ్చారు – మంచి రోజులు రాబోతున్నాయి, పార్టీకి మంచి జరగబోతోంది అని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
-
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
-
Janhvi Kapoor: ‘పెద్ది’ అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
-
Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!