Hyderabad Ganesh Immersion 2025: వినాయక నిమజ్జనాలకు రూట్ మ్యాప్ విడులైంది. ఖైరతాబాద్లో రేపు మార్నింగ్ 6 గంటలకు ప్రధాన శోభాయాత్ర ప్రారంభం అవుతుందని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ పరిమితులు విధించినట్లు పేర్కొన్నారు. బాలాపూర్ నుంచి చార్మినార్- అబిడ్స్-లిబర్టీ-ట్యాంక్బండ్-నెక్లెస్ రోడ్డు వరకు ప్రధాన శోభాయాత్ర సాగనుంది. సికింద్రాబాద్ నుంచి పాట్నీ-పరడైజ్-రాణిగంజ్-కర్బలామైదాన్-ట్యాంక్బండ్ మార్గం..
READ ALSO: Little Hearts : లిటిల్ హార్ట్స్.. పెద్ద సినిమాలను ఓడించిన కంటెంట్
* దిల్సుఖ్నగర్, అంబర్పేట్, నారాయణగూడ, ఉప్పల్ నుంచి ప్రాసెషన్లు లిబర్టీ వద్ద కలుస్తాయి. టోలిచౌకీ, మెహిదీపట్నం నుంచి వచ్చిన విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు చేరతాయి.
టప్పాచబుత్రా, ఆసిఫ్నగర్ నుంచి వచ్చిన విగ్రహాలు ఎంజే మార్కెట్లో కలుస్తాయి. ప్రధాన రూట్లపై ఇతర వాహనాలకు అనుమతి లేదు.
* సౌత్ జోన్: అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దారుషిఫా
* సౌత్ ఈస్ట్ జోన్ డైవర్షన్ పాయింట్లు: కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్గూడ
* సెంట్రల్ జోన్: లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్బండ్, బుద్ధభవన్
* ఈస్ట్ జోన్: శివాజీ బ్రిడ్జ్, పుల్లిబౌలి, హిమాయత్నగర్, వైఎంసీఏ
* నార్త్ జోన్: పాట్నీ, పారడైజ్, రాణిగంజ్
* పార్కింగ్ ప్రదేశాలు: ఎన్టీఆర్ స్టేడియం, కట్ట మైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్క భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్
* దాటకూడని జంక్షన్లు: ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్బాండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా
* విమానాశ్రయం వెళ్ళేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే వాడాలి
* సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లేవారు బేగంపేట్-పారడైజ్ రూట్ వాడాలి
* నిమజ్జనం అనంతరం లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే అనుమతి.
* ఆర్టీసీ బస్సులు పీక్ సమయంలో మెహిదీపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, నారాయణగూడ వరకు మాత్రమే అనుమతి
* సెప్టెంబర్ 6 ఉదయం 8 నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 వరకు నగరంలోకి లారీలు ప్రవేశం లేదు
* అంతర్ రాష్ట్ర, జిల్లా బస్సులు-చాదర్ ఘాట్ వైపు మాత్రమే దారి మళ్లింపు
* నిమజ్జనం కోసం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంక్లు, 8 ఎక్స్కవేషన్ పాండ్లు ఏర్పాటు
ప్రజలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులకు, పోలీసులకు సహకరించి, నిమజ్జానాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహిచుకోవాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ సూచించారు.
READ ALSO: Jabalpur Baby: డాక్టర్లనే ఆశ్చర్యపర్చిన బాల భీముడు.. 5.2 కిలోల బరువుతో పుట్టిన బిడ్డ