Hyderabad: లక్ష మంది మహిళలతో భారీ సభ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
- ఇవాళ లక్ష మంది మహిళలతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ సభ
- ఇందిరా మహిళా శక్తి మిషన్-2025ను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
- మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే 150 అద్దె బస్సులను ప్రారంభించనున్న సీఎం
- జిల్లా మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో 31 పెట్రోల్ బంకుల నిర్వహణ.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. ఇందిరా మహిళా శక్తి మిషన్ను ఆవిష్కరించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. లక్ష మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది ప్రభుత్వం. అందులో భాగంగా.. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి మిషన్ను ఆవిష్కరించనున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగే ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.
Bhupalpally: మళ్లీ కలవర పెడుతున్న పెద్దపులి సంచారం.. పాదముద్రలు గుర్తింపు
Also Read
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులా చేసేలా ప్లాన్ చేసింది. ఇటీవల ఇందిరా మహిళా శక్తి మిషన్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సర్ప్, మెస్మాలకు విలీనం చేసి మహిళలకు లక్షల కోట్ల రూపాయల రుణం అందించడమే ఈ పథకం ఉద్దేశం. ఇకపై మహిళా సంఘాలన్నీ ఒకే వ్యవస్థ కింద పనిచేసేలా మహిళా శక్తి మిషన్ ను రూపొందించారు. మహిళా సంఘాలు ఏడాది కాలంలో సాధించిన విజయాలతో పాటు మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025లో పొందుపరిచారు. పలు జిల్లాల నుంచి మహిళలు ఈ సభకు తరలివచ్చి తిరిగి వెళ్లేలా 600కు పైగా ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Women’s Day : మహిళ త్యాగం, ప్రేమ ఎనలేనివి..!
ఇవాళ్టి మండల మహిళా సమైఖ్య సంఘాల ఆధ్వర్యంలో నడిచే 150 ఆర్టీసీ అద్దె బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 31 జిల్లా మహిళా సమైఖ్య సంఘాల ఆధ్వర్యంలో.. 31 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం ఆయిల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. మహిళా సంఘాల సభ్యులకు రుణ బీమా, ప్రమాద బీమా చెక్కులను అందజేయనున్నారు. మహిళా సంఘాలకు రుణ సదుపాయాలు కల్పిస్తూ చెక్కులను జిల్లా మహిళా సమైఖ్యల అధ్యక్షులకు అందజేయనున్నారు. జిల్లా మహిళా సమైఖ్యల సభ్యులకు యూనిఫాం, చీరలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు.
తాజావార్తలు
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో