CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగర్కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ.12,600 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇందిరా గిరి జల వికాస పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. పథకం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా 23 మంది చెంచు గిరిజన రైతులకు సౌర ప్యానెళ్లు , సోలార్ పంపు సెట్లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అంతకుముందు, సీఎం రేవంత్ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
Naveen Polishetty : సంచలన దర్శకుడితో నవీన్ పోలిశెట్టి మూవీ..?
తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులలో ఒకటైన ఇందిరా గిరి జల వికాసం పథకం ద్వారా గిరిజన రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ROFR పట్టాలు కలిగిన గిరిజనులకు ఈ పథకం వర్తించనుంది. వచ్చే ఐదేళ్లలో 2.10 లక్షల మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపకల్పన చేసింది. మొత్తంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఈ పథకానికి మౌలిక ఉద్దేశం.
Terrorists: జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్!